Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Drugs : గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కల కలం, విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు

Drugs : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో మరోసారి విదేశీ గంజాయి పట్టుబడి కలకలం రేపింది. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. అతని వద్ద 170 గ్రాము ల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్‌ గంజాయి, బైకు, సెల్‌ఫోల్‌ స్వాధీ నం చేసుకున్నారు.నిందితుడిని బెంగళూరులోని డెలాయిట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శివరామ్‌గా గుర్తించారు. అమె రికాలోని కాలిఫోర్నియా నుంచి గంజాయిని హైదరాబాద్‌కు అక్ర మంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అజయ్‌తో కలిసి మత్తు పదార్థా లను విక్రయిస్తున్నట్లు వెల్లడిం చారు‌.

 

 

ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇద్దరూ కలిసి ప్రతీ వారాంతంలో గంజాయి బిజి నెస్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. లోకల్‌ గంజాయిని బెంగళూరులో కొనుగోలుచేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నా రని తెలిపారు. సినిమావాళ్లకు కూడా విదేశీ గంజాయి సరఫరా చేసినట్లు తెలుస్తున్నది. పరారీలో ఉన్న అజయ్‌ని గాలిస్తున్న పోలీ సులు, ఎవరెవరికి సరఫరా చేస్తు న్నారనే విషయమై కూపీ లాగు తున్నారు.