–డీఎస్సీ సన్నద్దతకు గడువు ఇవ్వాలి
–కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కామగోని శ్రావణ్ గౌడ్
DSC Exam: ప్రజా దీవెన, కాకతీయ యూనివ ర్సిటీ: రాష్ట్రంలోటెట్ పరీక్షలో ఉత్తర్ణులై డీఎస్సీకి (DSC) అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ (TELAGANA) రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల ప్రిపరేషన్ గడు వు ఇవ్వాలని కాకతీయ యూనివ ర్సిటీ విద్యార్థి నాయకుడు కామ గోని శ్రావణ్ గౌడ్ కోరారు. మార్చి నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Teacher Eligibility Test) నోటిఫి కేషన్ (NOTIFICATION) విడుదల కాగా అభ్య ర్థులు పూర్తి సమయం దాని ప్రిప రేషన్కే కేటాయించారాని, జూలైలో నిర్వ హించే డీఎస్సీ పరీక్ష సిల బస్ ను చదివేందుకు వారికి సమయం లేదన్నారు. డీఎస్సీలో (DSC) టెట్ మా ర్కులకు వెయిటేజీ ఉన్నది కావున వారు టెట్ పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యారు. అలాగే డీఎస్సీ టెట్ సిలబస్లు వేర్వేరుగా ఉన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం అభ్యర్థులకు న్యాయం జరి గేలా నిర్ణయం తీసుకోవాలని కోరా రు.
ఇన్ని రోజులు టెట్ పరీక్షకు స న్నద్దమైన విద్యార్థులు ఈ స్వల్ప కాలంలో డీఎస్సీ సిలబస్ ను (DSC SYLLBUS) పూర్తి చేయలేరని దీంతో వారిపై ఒత్తిడి పెరిగి ఉద్యోగ అవకాశాన్ని కోల్పో వడంతో పాటు మానసిక ఆత్మ విశ్వాసన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని డీఎస్సీ నిర్వహణ తేదీలను జూలై 17 నుంచి కాకుండా అక్టోబర్లో నిర్వహించేలా చర్యలు చేపట్టా లన్నారు. డీఎస్సీ అభ్యర్థులను (DSC candidates) ఒత్తిడికి గురి చేయకుండా మాన వతా దృక్ఫథంతో ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాలని, అదే విధంగా ఈ మధ్య కాలంలో బదిలీలు మరి యు పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులను ప్రస్తుతం నోటిఫికేషన్ కు కలిపి మొత్తం 25 వేల మెగా డిఎ స్సి ప్రకటించి మరో 3 నెలల తర్వా త పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ (DEMAND) చేశారు.