— కేంద్రానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అప్పీల్
Duddilla Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) డిమాండ్ (demand)చేసారు. దీనిని కేవలం ఓ రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణాదిలో ఇటువంటి ఘటన గతంలో ఎప్పు డూ చోటు చేసుకోలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ (waynad)విలయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని శ్రీధర్ బాబు (Sridhar Babu) ) సూచిం చారు.అతి భారీ వర్షాలు, క్లౌడ్ బర స్ట్ తో కొండ చరియలు విరిగిపడ టం, వర్షపు నీటితో బురద కలిసి ప్రవహించే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందిచాలని ఆయన కోరారు. ఆధునిక శాస్త్ర విజ్ణానాన్ని వినియోగించి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ (Mapping)చేయాలని సూచించారు. వాతావర ణ శాఖ ఇచ్చే ఆరెంజ్, రెడ్ అలెర్టు లతో ప్రమాదాలను అంచనా వేయ లేమని ఉపగ్రహాల చిత్రాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికల ను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించా రు. భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే కొండ చరియలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశా లను కూడా కేటగిరీల వారిగా గుర్తిం చాలని ఆయన అన్నారు. రుతు పవనాల సమయంలో ఆ ప్రాంతా ల్లో సహాయక బృందాలు నిరంతరం అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.