DycmMalluBhattiVikramarka : దశాబ్దాల ఓబీసీల కల నిజం చేయబోతున్నాం
--ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది --అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయింస్తాo --మార్చి మొదటి వారంలో అసెం బ్లీలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు --మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
దశాబ్దాల ఓబీసీల కల నిజం చేయబోతున్నాం
–ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
–అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయింస్తాo
–మార్చి మొదటి వారంలో అసెం బ్లీలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు
–మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
DycmMalluBhattiVikramarka : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగా ణ రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రం గాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశు ద్ధితో ఉందని, ద శాబ్దాల బీసీల కలను నిజం చేస్తా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ సచివాలయంలో మీడియాతో మాట్లాడా రు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ లో ఓ బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవే శపెట్టి ఆమోదింప చేస్తాం అన్నారు.
శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదిం చిన బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి కావ లసిన అన్ని ప్రయత్నాలు చే స్తాము దేశంలోని అన్ని రాజకీయ పార్టీ లపై ఒత్తిడి తెస్తాం అన్నా రు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృం దం వెళుతుందని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆ మోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కడతాం అన్నారు. ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారికోసం మరో అవకాశం ఇస్తామన్నారు.
రాష్ట్రంలో మూడు శాతం కుటుం బాలు సర్వే లో పాల్గొనలేదు వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్ కేటీఆర్ పల్లా వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు,మరి కొందరు అందు బాటులో లేకుండా పోయారు వా రందరి కోసం మరోసారి అ వకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్ర భుత్వం అవకాశం కల్పి స్తుందని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు నమో దు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు.
మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకో వచ్చ ని తెలిపారు.ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమో దు కు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలి పా రు. ఓబీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కల్పించాలనేది అందరి కోరిక బలమైన లక్ష్యం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. రాష్ట్రంలో కుల గణన విజయ వంతం అయితే దేశమంతటా చే యా ల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బంది తో పూర్తిగా శాస్త్రీయంగా స మగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో జరిగిందని అన్నా రు.రాష్ట్రంలో ఏ ఏ వర్గాల జనాభా ఎంతో శాసనసభ లో లెక్కలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు, చర్చ కూడా జరిగిందని తెలి పారు.ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం, మద్దతు కూడబెట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ పా ర్టీలు, సోషల్ యాక్టివిస్టులు, మేధావులు, ప్రజలు అంతా కలిసి రా వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 56 శాతంగా ఉ న్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ శాంతకుమా రి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొ న్నారు.