Elijala Srinu : ప్రజా దీవన, నారాయణపురం : భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య బాటలో నడుస్తుంది.ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బి.జే.వై.యం అధికార ప్రతినిధి ఎలిజాల శ్రీను మాట్లాడుతూ ఇటీవల పద్మశ్రీ అవార్డుల జాబితాలో గద్దర్ పేరు లేకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని తప్పుపడుతూ విప్లవ భావజాలాలు కలిగిన వ్యక్తులను భారతీయ జనతా పార్టీ మీదికి ఉసిగొల్పే పనిలో భాగం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గద్దర్ తెలంగాణ ఉద్యమ కారుడు, కళాకారుడు, గద్దర్ కలంతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తి,కానీ తన ఆటా పాట తో విప్లవ భావాలతో యువకులను నక్సలిజం వైపు వెళ్లేలా చేశారు.తను విప్లవ భావజాలనికి కొమ్ముకాస్తూ అమాయకులైన ఏబీవీపీ, బిజెపి జాతీయభావాలు కలిగిన యువకులను హతమార్చుటకు మద్దతు పలికాడు.ఆనాటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుండగొని మైసయ్య గౌడ్ ను తెరట్పల్లి గ్రామంలో , మంచాల మండలం తాళ్ళగూడెం గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్ ను కాల్చి చంపారు.అనేక మంది బీజేపీ నాయకులను,కార్యకర్తలను హింసించారు. కాబట్టి సగటు బీజేపీ కార్యకర్తల ఆవేదనను బండి సంజయ్ ప్రస్తావించారు.సంస్థాన్ నారాయణపురం మండలం పరిదిలో అనేక మంది కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలలో హింసించ బడ్డ వారు నేటికీ ఉన్నారు.
అలాంటి వారందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని రాజకీయాలు మాట్లాడాలి. గతంలోని పాలకుల నిర్భందాలకు , ఆధిపత్య వర్గాల జులుం కు గద్దర్ తుపాకి తోని రాజ్యాధికారం సాధించవచ్చు అని అమాయకులైన యువకులను విద్యకు దూరం చేసి తల్లిదండ్రులకు, సమాజానికి దూరం చేసి అడవులలో తిప్పుతూ ప్రజాస్వామ్యం పై పరోక్షంగా దాడి చేశాడు.
అమాయక ప్రజలు పిల్లల చేతికి విప్లవ పాఠాలు నేర్పించి వాళ్ల చేతికి కలం బదులు ఆయుధాలు పట్టేలా చేశాడు. తన కుటుంబ పిల్లలను ఉన్నత చదువులకై అమెరికా పంపించిన ఘనత గద్దర్ ది.నిజంగా గద్దర్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడకపోతే ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దర్ శరీరంలో తుపాకీ గుండ్లు ఎందుకు దించింది.ఆనాడు ఏ ప్రభుత్వం అధికారం లో ఉంది అనే సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ.భారత భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి గద్దర్ ఐతే. తాను ఎన్నిసార్లు ఓటు హక్కును వినియోగించుకున్నాడు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలి.