తన భూమిని నిరుపేదలకు పంచి, కులమత బేధాలు లేని సమాజం కోరుకున్న ఉత్తమమైన నాయకుడని పేర్కొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 1936లో వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం వారి జీవన విధానం మెరుగుపడాలని వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తన జీవితం మొత్తం కూలీల కోసం పేదల కోసం దేశ ప్రజల కోసం అంకితమిచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి దేశ ప్రజల కోసం పిల్లల్ని కనకుండా తన జీవితాన్ని దేశానికి అంకితం ఇచ్చాడని ఆయన జీవితాన్ని ఇప్పుడున్న యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీలో పని చేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఈ విధానాలపై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ ఉపాధ్యక్షులు పనస చంద్రయ్య, రైతు సంఘం పట్టణ నాయకులు దండెంపల్లి యాదయ్య, పల్లె నగేష్ సిరిశాల కుమార్, దూదిమెట్ల వెంకన్న, పామనగుండ్ల రాజు ఆంజనేయులు, వెంకన్న, పార్వతమ్మ, మాధవి, కళమ్మ, తదితరులు పాల్గొన్నారు.