*రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
*నీరు విడుదల చేయాలని సాహసోపేత నిర్ణయం మంత్రి ఉత్తమ్ ది. ఎన్నేని వెంకటరత్నం
Enneni Venkataratnam: ప్రజా దీవెన ,కోదాడ: కాంగ్రెస్ పార్టీకి (Congress party) మంత్రి ఉత్తమ్ కు ఎడమ కాలు ఆయకట్టు రైతాంగం రుణపడి (రుణపడి ) ఉంటుంది… కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం అన్నారు గురువారం ఆయన నివాస గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి (Uttamkumar Reddy)నాగార్జునసాగర్ ఎడమ కాలువ రైతాంగం రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాగర్ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల అభినందించారు.
గత పాలకులు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించారని కాంగ్రెస్ పార్టీ (Congress party)రైతుల ప్రభుత్వం అన్నారు. కోదాడ నియోజకవర్గంలో రైతాంగం నష్టపోవద్దని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని రైతంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ (Congress party)ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తుందని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణను చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు గత ప్రభుత్వంలో మూలన పడ్డ లిఫ్టులు అన్నింటిని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసి రైతులకు సాగునీరు అందించాలని పునరుద్ధరిస్తున్నారని కొనియాడారు. యావత్ రైతాంగం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటుందన్నారు ఈ సమావేశంలో సాదినేని అప్పారావు, చందు నాగేశ్వరరావు, ఒంటి పులి శ్రీనివాసరావు, పారా వెంకటేశ్వరరావు, నెమ్మది దేవమణి రాయల కృష్ణారావు, భాస్కరరావు, వేమూరి విద్యాసాగర్ , రాము, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.