Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmers’ Participation : రెవెన్యూ సదస్సులకు రైతులు హాజరయ్యేలా చూడాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Farmers’ Participation  : ప్రజాదీవెన నల్గొండ :  ఈనెల 3 నుండి 20 వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ఆయా గ్రామాలలోని రైతులందరూ హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కేతేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల పై తహసిల్దార్, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కేతేపల్లి మండలంలో మొదటి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులపై వివరాలను ఇన్చార్జి తహసిల్దార్ ఎం ఏ సత్తార్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

 

ఎలాంటి దరఖాస్తులు వచ్చాయని? సదస్సులకు ఎంతమంది హాజరయ్యారని? అడిగారు. రెవెన్యూ సదస్సులకు అందరు హాజరవుతున్నారా ? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా ఆయా గ్రామాల్లో సదస్సు నిర్వహించే విషయాన్ని ముందే టాంటాం ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అంతేకాక గ్రామంలో ఉన్న రైతులందరూ సదస్సుకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని ఆమె సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలిపారు.