Entrance Test :ప్రజా దీవెన, కోదాడ : నవోదయ విద్యాలయల్లో 9, 11 తరగతుల మిగులు సీట్ల ఖాళీల భర్తీకై ప్రవేశ పరీక్షను శనివారం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, KSSBM జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ సీసీ రెడ్డి పాఠశాలల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు.
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మందికి గాను 181 మంది విద్యార్థులు,KSSBM జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 240 మందికి గాను 182 మంది విద్యార్థులు సెయింట్ జోసెఫ్ సీసీ రెడ్డి విద్యా నిలయంలో 274 మందికి గాను 216 మంది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుఅయ్యారని తెలిపారు.