–ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక మందులు కరువు
–ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన బకాయిలు
— నల్లగొండ మీడియా సమావే శంలో మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేందర్
Etala Rajender:ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వ దావకానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యు లు, మల్కాజిగిరి పార్లమెంటు స భ్యులు ఈటెల రాజేందర్ (etala rajender)అన్నా రు. బుధవారం బిజెపి (BJP)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమో దు కార్యక్రమం ప్రారంభించేందుకు నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో (reporters meeting)మాట్లాడారు. వరుస వర్షాల కారణంగా ప్రజలంతా వైరల్ ఫీవ ర్కు గురయ్యారని, ఊర్లకు ఊర్లు దావకానాల్లో చేరికవుతు న్నారని అన్నారు. అయితే ప్రజల వైద్యాన్ని అందించేందుకు సరైన డాక్టర్లు,(docters)సిబ్బంది, మందులు అందుబా టులో లేవని ఆయన అన్నారు. సరైన వైద్యం అందడం లేదని ప్రజ లు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమ ర్శించారు. ప్రభుత్వ హాస్పిటల్ (goverment hospital)ల న్ని 24 గంటలు పని చేస్తేనే ప్రజల కు మేలు అవుతుందన్నారు. ప్రభు త్వం నిర్లక్ష్యం వల్ల వైద్య వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చే శారు. మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో(Medical college hospital)కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫె సర్లు ఇతర సిబ్బంది పూర్తిస్థా యి లో లేరని అన్నారు.
అప్ గ్రేడ్ అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేపర్ల వరకే పరిమితం అయ్యా యని అన్నారు. కేంద్ర ప్రభుత్వం(central government)ఇచ్చిన నిధులకు సంబం ధించి యూసీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన నిధులు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం (Congress government)ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఉచిత బస్సు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన విమర్శించారు. వందేళ్లు ఇప్పుడు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఎలా అమలు చేస్తారని ఎన్నికలకు ముందే తాము ప్రశ్నించామన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అహంకారం పెరిగిందని అర్థమైందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి(revanth Reddy)ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలకు అర్థమైంది అన్నారు. ఇలా ఉంటే తాము అధికారంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియని కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress party members)ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని ఆయన అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరల్లి చంద్రశేఖర్, పోతేపాక సాంబయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక ముని కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.