Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Intermediate Education : టెన్త్ ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి

–9-12 త‌ర‌గ‌తుల విధానంపై అధ్య‌ య‌నం చేయండి
–కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల నిధు లు సాధించoడి
–యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పై నివేదిక సమర్పించండి
–విద్యా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Intermediate Education : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ప‌దో త‌ర‌ గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క విద్యా ర్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చూడాల‌ని ముఖ్య‌ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ ను ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తోం ద‌ని ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌ రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపో వ‌డానికి గ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ ని సూచించారు. విద్యా శాఖ‌పై ఐసీ సీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రె డ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హిం చారు.

విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందున‌ ఆ ద‌శ‌లో వి ద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ల‌ భించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీ ఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రా ష్ట్రాల్లో 9వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉంటుంద‌ని అక్క‌డ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు సీఎంకు తెలియ‌జేశా రు. ఇంట‌ర్మీడియ‌ట్ వేరుగా.. 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్య‌య‌నం చేసి ఈ విధానంపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

ఈ విష‌యంలో విద్యా క‌మిష‌న్, ఆ వి భాగంలో ప‌నిచేసే ఎన్జీవోలు, పౌ ర స‌మాజం సూచ‌న‌లు, స‌ల‌హాల‌ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ఇంట‌ర్మీడియ‌ ట్ విద్య మెరుగుకు అన్ని ద‌శ‌ల్లో చ‌ ర్చించి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ‌కు పె డ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలి పారు. ఇంట‌ర్మీడియ‌ట్‌లో విద్యా ర్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపై నా దృష్టిపెట్టాల‌న్నారు. యంగ్ ఇం డియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల న‌ మూనాల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌తి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు.

పాఠ‌శాల‌ల నిర్మాణం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , నిర్మాణాల ప్ర‌గ‌తిపై ప్ర‌తి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ ను ఆదేశించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తా మ‌న్నారు. ఇప్ప‌టికే ఒక్కో పాఠ‌శాల‌ కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌ యినందున‌, రెండో పాఠ‌శాల‌కు సం బంధించిన స్థ‌ల గుర్తింపు, సేక‌ర‌ణ ప్ర‌క్రి య‌పై దృష్టి సారించాల‌ని సీఎం ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌ మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ని ర్మాణ న‌మూనాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప‌లు మార్పుల‌ను సూచించారు. సాధ్య‌ మైనంత త్వ‌ర‌గా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించా రు.

ఈ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హా దారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌ భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిత‌, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌ రులు పాల్గొన్నారు.