నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
ExMP mandajagannadham: ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: నా గర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడు తున్న మందా జగన్నాథం హైద రాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడి చారు. మందా జగన్నాథం నాగర్ కర్నూ లు లోక్ సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. మందా జగన్నాథం ఢిల్లీలో తెలం గాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు.
మందా జగన్నాథం 1951 మే 22న జన్మించారు. ఆయన 1996, 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. మూడు సార్లు టీడీపీ తరఫున లోక్ సభలో అడుగుపెట్టిన ఆయన 2009లో కాంగ్రెస్ తర ఫున నెగ్గారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరా రు. మందా జగన్నాథం మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నాగర్ కర్నూ లు ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్య మకారుడిగా మందా జగన్నాథం కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొ న్నారు. అటు, మందా జగన్నాథం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
పేద కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువులు చదివారని, తెలుగుదే శం పార్టీ తరఫున మూడు సార్లు ఎంపీగా గెలిచారని చంద్రబాబు వెల్ల డించారు.ఈ విషాద సమయం లో మందా జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.