Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fake reporters : అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరులు అరెస్టు

Fake reporters : ప్రజాదీవెన, నల్గొండ క్రైమ్ : నకిలి విలేఖరుల ముసుగులో గుర్తింపు లేని క్రైమ్ మిర్రర్ (డిజిటల్ పెపర్) అంటూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవంటి ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసు పరారీలో మరొక ప్రధాన నిందితుడు. వీరి వద్ద నుండి ఒక లాప్ టాప్, బాధితుల ద్వారా అమౌంట్ పంపించుకున్న3 సెల్ ఫోన్ లు మరియు సంబందిత ఫోన్ పే స్క్రీన్ షాట్లు.మిర్యాలగూడ సబ్ డివిజన్ కార్యాలయం నుండి మీడియా సమావేశంలో వివరాలు తెలిపిన డీఎస్పీ రాఖశేఖర్ రాజు గత నెల రోజులుగా క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) లో పైన తెలిపిన నిందితులు.

 

“వీరగాధ” అనే పేరుతో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏటువంటి ఆధారాలు లేకున్నా క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ లో అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరి బాధ తట్టుకోలేక సి.ఐ తీవ్ర మనస్తాపానికి చెంది సదరు క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) యాజమాన్యామ అంజి, రఘు మరియు ఆనంద్ లను సంప్రదించగా పైన తెలిపిన నేరస్తులు మొదటగా 5 లక్షలు ఇస్తే తన గురించి ప్రచారం చేయమని డిమాండు చేసినారని, ఆ తర్వాత చివరగా Rs.2,00,000/- లు ఇస్తే ఎలాంటి తప్పుడు వార్తలు రాయము అని చెప్పగా, సిఐ అంత డబ్బు ఇవ్వలేను, తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి డబ్బు నిరాకరించారు.

 

కానీ క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) వాళ్ళు వ్రాసిన నిరాధార వార్తలకి సి.ఐ, కుటుంబసభ్యులు క్రుంగిపోతుండడంతో, ఈ విషయం తెలుసుకున్న సిఐ స్నేహితుడు తేదీ: 24.01.2025 రోజున క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ అంజి ని తన స్నేహితుడు ఇంటికి రమ్మనగా ఆనంద్ మరియు రఘులకి విషయం చెప్పిన అంజి, సిఐ స్నేహితుడి దగ్గరికి వచ్చి బేరమాడిన తరువాత చివరగా Rs.1,10,000 /- లను అంజి తీసుకున్నాడు. ఇందుకు సంబందించి ఆడియో వీడియో ఆధారాలు కలవు. ఇందులో అంజి 10 వేల రూపాయల తన వద్ద ఉంచుకొని, మర్రిగూడ మండలాన్ని చెందిన క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) రఘు కి తేదీ. 24.01.2025 రోజున వేములపల్లి లో Rs.1,00,000 /- ఇవ్వడం జరిగింది.

 

ఇందులో Rs.85,000 /- రఘు నల్లగొండ నుండి ఎటిఎం డిపాజిట్ మిషన్ ద్వారా తన అక్కౌంట్ లో వేసుకొని ఆనంద్ చెప్పిన ఫోన్ నంబర్ కి పంపడం జరిగినది. ఇందుకు సంబందించి రఘు ఫోన్ లో ఆధారాలు కలవు. కానీ సదరు క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) మరలా డబ్బులు కావాలని లేకపోతే క్రైమ్ మిర్రర్ పేపర్ లో సిఐ వ్యక్తిగత విషయాలు వ్రాస్తానని భేదిరిస్తున్నాడని తెలిసి మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది. కాగా మిర్యాలగూడ రూరల్ సి.ఐ వీరబాబు పై క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) లో వచ్చిన అవినీతి ఆరోపణల పై జరిగిన విచారణ క్రమం లో నిందితులు తమ వైపునుండి ఎటువంటి ఆధారాలు అందించలేక పోయినారు.

 

పై విషయం సోషల్ మీడియా లో వైరల్ కాగా అనేక మంది క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) బాడితులు జిల్లాలో వేరువేరు ప్రాంతాలలో ఫిర్యాదు చేయడం జరిగినది. అందులో ముఖ్యంగా నాగార్జున సాగర్ లో అటవీశాఖ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి వద్ద పైన తెల్పిన నేరస్తులు గతంలో మునుగోడు రేంజ్ మర్రిగూడ సెక్షన్ లో పని చేస్తున్న రోజులలో తన పైన కూడా లేనిపోని కథనాలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేసి వాట్సాప్ కాల్స్ లో మాట్లాడి బెదిరించి 50 వేల రూపాయలు పొన్ పే ద్వారా వసూలు చేయడం జరిగింది. ప్రసుత్తo టివి లో వస్తున్న కథనాలను చూసి బాధితుడు పిర్యాదు చేయగా సాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది.

 

అలాగే గత సంవత్సరం ఆగష్టు నెలలో ప్రస్తుతం సూర్యపేట అసిస్టెంట్ స్తాటికల్ ఆఫీసర్ (హెల్త్ డిపార్ట్మెంట్) గా పని చేస్తున్న అధికారి వద్ద పైన తెల్పిన నేరస్తులు గతంలో నల్గొండ డి ఎంహెచ్ఓ లో పని చేస్తున్న రోజులలో తన పైన కూడా లేనిపోని కథనాలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేసి వాట్సాప్ కాల్స్ లో మాట్లాడి బెదిరించి 50 వేల రూపాయలు పొన్ పే ద్వారా పంపించుకోవడం జరిగిందని ప్రసుత్తo టివి లో వస్తున్న కథనాలను చూసి బాధితుడు పిర్యాదు చేయగా నల్గొండ వన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది.

ఇట్టి వ్యవహారానికి సంబందింది మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో నమోదు అయిన కేసు విచారణలో భాగంగా గత కొంత కాలంగా విలేకరుల ముసుగులో క్రైమ్ మిర్రర్ (డిజిటల్ పేపర్) అంటూ ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ ఏలాంటి ఆధారాలు లేకుండా, అక్రిడేషన్ లేకుండా డిజిటల్ పేపర్ ద్వారా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తూ వాటిని అపాలంటే అడిగినంత డబ్బులు డిమాండు చేస్తూ వసూలుకు పాల్పడుతున్న తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు అరెస్టు చేయనైనది, రిమాండ్ కి తరలించడం జరుగుచున్నది.