Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

FamilySuicide : పెనువిషాదం, ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

పెనువిషాదం, ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

FamilySuicide : ప్రజా దీవెన ములుగు: పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో చోటు చేసు కుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూ డెం, మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో మంగళవారం చో టు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుటుంబ కలహాలతో ఓ జంట మం గళవారం పురుగుల మందు తాగి మృతి చెందారు.

మృతులు ఆలం స్వామి, ఆలం అశ్విని 15 రోజులుగా కలిసి జీవ నం సాగిస్తున్నారు. అశ్వినికి ఇది వరకు వేరొకరితో పెళ్లి కాగా ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో మొదటి భర్త కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి రూ.20 లక్షలు డిమాం డ్ చేసినట్టు సమాచా రం. కులపెద్దలు అంతా కలిసి తప్పు జరిగింది కాబట్టే స్వామిని రెం డు లక్షలు కట్టాలని ఒప్పించినట్టు తెలిసింది.

దీనిని మొదటి భర్త ఒ ప్పుకోకుండా పోలీస్ స్టేషస్‌లో కేసు పెట్టినట్లు సమాచారం. దీంతోనే భ యపడి పోయిన ఇరువురు పురుగుల మం దు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.