Farmer Award : ప్రజా దీవెన శాలిగౌరారం : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం జాలోనిగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చీమల లింగస్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రకృతి రత్న ఉగాది పురస్కారం అందుకున్నారు.గో ఆధారిత సహజ వ్యవసాయం పై ఎన్ టి ఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో నిర్వహించిన సదస్సు లో విజయవాడ పార్లమెంట్
టి డి పి అధ్యక్షులు నెట్టెం రఘురాం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మెన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వై. వెంకటేశ్వరరావు చేతుల మీదుగా చీమల లింగస్వామి ప్రకృతి రత్న పురస్కారం అందుకున్నాడు.ఈ సందర్బంగా అవార్డు గ్రహీత చీమల లింగస్వామి మాట్లాడుతూ ఆవు మూత్రం, పేడ ప్రకృతి లో లభించే వనరుల తో సేద్యం చేస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం పై రైతులకు అవగాహన కలిపిస్తూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపు గా ఈ అవార్డు అందుకున్నట్లు వివరించారు.