Farmer suicides : ప్రజా దీవెన, వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగు నీరు రాక ఒక మహిళా రైతు, అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య ఇలా ఆత్మ హత్యలు ఆందోళన కలిగిస్తు న్నా యి. వికారాబాద్ జిల్లా పరిగి మం డలం సజీరాబాద్ తండాకు చెంది న కట్రావత్ భారతి అనే మహిళా రైతు గత ఏడాది ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసింది.తనకున్న రెం డు ఎకరాల పొలానికి సాగు నీరు అందక పంట ఎండిపోయే స్థితికి వచ్చింది.. దీంతో మనస్తాపంతో పొలంలోనే విద్యుత్ టవర్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన సుప్పరి మాణిక్యం (49) అనే రైతుకు రైతు భరోసా రాక, రుణమాఫీ అవ్వక, కొడుకు కొలువు వస్తుందని నమ్మ కం లేక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పొలంలో నే పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు