Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rythu Bharosa celebrations : రైతు భరోసా సంబరాలకు రైతన్నలు

–వాహనాలను జండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

Rythu Bharosa celebrations : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న రైతు భరోసా సంబరాలలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళుతున్న రైతుల వాహనాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

సుమారు 200 మంది రైతులు జిల్లా నుండి హైదరాబాదులో నిర్వహిస్తున్న రైతు భరోసా రైతు సదస్సుకు హాజరయ్యేందుకు తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యాన శాఖ డిడి అనంతరెడ్డి, వ్యవసాయ తదితరులు, హాజరయ్యారు.