–రిజిస్టర్ లను పరిశీలించిన…..
–పౌర సరఫరాల శాఖ కమిషనర్
–డి ఎస్ చౌహన్
Paddy Procurement : ప్రజాదీవెన, సూర్యాపేట :రైతులు కొనుగోలు కేంద్రాలకి ధాన్యం తరలించ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహన్ అన్నారు.ఆదివారం బాలాజీనగర్ పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే చిలుకూరు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహన్ సందర్శించారు. ఈ సందర్బంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాట్లాడుతూ ధాన్యం లో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 ఉండేలా నాణ్యమైన వడ్లు తీసుకొస్తే వెంటనే కాంటా వేసి మిల్లులకి తరలించటం జరుగుతుందని తెలిపారు. బాలాజీనగర్ పిఎసిఎస్ కొనుగోలు కేంద్రం లోని గోపతి శ్రీనివాస్ ధాన్యం తేమ శాతం పరిశీలించగా వడ్ల నాణ్యత బాగుందని అభినందించి శాల్వా తో సన్మానించి రైతులందరు ఇలాగే నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే పేదవారికి సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి వారి ఆకలి తీర్చవచ్చు అని తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగానే వారికి సీరియల్ నెంబర్ ఇవ్వాలని ఆ సీరియల్ ప్రకారమే కాంటా వేసి మిల్లులకి తరలించాలని తెలిపారు.
గన్ని సంచులు, లారీల సమస్య, హమాలీ ల కొరత ఉన్నదా అని నిర్వాహకులని అడగగా లారీలు, హమాలీలు, గన్ని సంచుల సమస్య లేదని కమిషనర్ కి తెలిపారు.తదుపరి రికార్డులను పరిశీలించి బాలాజీ నగర్ పి ఎ సి ఎస్ నుండి 5000 క్వింటాలు, చిలుకూరు ఐకేపీ కొనుగోలు కేంద్రం నుండి 6052 క్వింటాలు మిల్లులకి తరలించటం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పి రాంబాబు,ఆర్డీఓ సూర్యనారాయణ డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, తహసీల్దార్ వాజీద్ అలీ,డి సి ఓ పద్మ, ఎపిడి సురేష్, పి ఎ సి ఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ నరేష్, డైరెక్టర్ ప్రభాకర్,సి ఈ ఓ మంద వెంకటేశ్వర్లు,ఎంపిడిఓ గిరిబాబు, డి టి సి ఎస్ రాంరెడ్డి,ఎ ఈ ఓ అనూష, సెంటర్ ఇంచార్జి స్వరూప, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.