–మటన్ మనస్పర్థలతో మస్తు డిష్యుం డిష్యుం
— బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు
–చిలికిచిలికి గాలివానలా మారిన మటన్ గొడవ
Fight in Marriage: ప్రజా దీవెన, నవీపేట: బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే (fights) నిజ జీవితంలో ఓ ఘటన జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కళకళలాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ‘ మొదలైంది ‘ముక్కల’ లొల్లి. భోజనంలో (meals) మటన్ ముక్కలు (Mutton pieces)తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజా మాబాద్ జిల్లాలో చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండ లంలోని బాద్గుణకు చెందిన వ రు డితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగి న పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరఫు బంధువులు గొడ వకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తర పు బంధువులతో వాదనకు దిగా రు. చిన్నగా మొదలైన గొడవ (fight) కాస్త ఒక్కసారిగా పెద్దగా మారింది. దీం తో అటు వధువు, ఇటు వరుడు తరఫు చెందిన వారు ఒకరినొకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు.
దొరికిన వాటితో దొరికినట్లు గా.. అంతటితో ఆగకుండా వంట గంటెలు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స (Better treatment) కోసం 108 వాహ నంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. కాగా ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరు పక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే వి ధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు (Registration of case) చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.