Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ఒకరి దుర్మురణం, 13మంది సేఫ్
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఘటన

Fire Accident : ప్రజాదీవెన, భండారా: మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో పేలుడు జరిగిందని జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కోల్తే వెల్లడించారు. ఎల్‌టీపీ విభాగంలో పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది.

 

 

ప్రమాద సమయంలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కింద చిక్కుకున్న మిగతా 13 మందిని రక్షించి సత్వర చికిత్స అందించారు. ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక విభాగం సిబ్బంది ఎంతో శ్రమించారు. వారికి పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ విభాగం బృందాలు సహాయం చేశాయి.