Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Model Houses Politics : పదేండ్లు బొమ్మ ఇండ్లతో ఓట్లు వేయించుకుండు

–కేసీఆర్ ఇక్కడి అవ్వతో అన్నం తిని వాసాలమర్రిని ఆగం చేసిండు
–మొట్టమొదట ఇందిరమ్మ ఇల్లు ఆ తల్లికే ఇస్తున్నం
–రాబోయే నెలరోజుల్లో భూ సమ స్యలు పరిష్కరిస్తం
–ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రా లు అందించిన మంత్రి పొంగులేటి

Model Houses Politics :  ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: బిఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓట్లు వే యించుకున్నాడు తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేం మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నామని, ఇం దిరమ్మ ప్రభుత్వమంటేనే పేదోడి ప్రభుత్వమని , 20 లక్షల ఇందిర మ్మ ఇండ్లను కట్టడం కాంగ్రెస్ ప్రభు త్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
వాసాలమర్రిలో ఇక్కడి అవ్వతో అన్నం తిని దేశానికి రోల్ మోడల్ చేస్తామని మాట ఇచ్చి మిమ్మల్ని ఆగం చేసిండని, వాళ్లు ఆగం చేసి పోతేమేం ఇందిరమ్మ ఇండ్ల మొదటి ప్రొసిడింగ్ ను అప్పట్లో కేసీఆర్ తో భోజనం చేసి హాస్పిటల్ పాలైన ఆ గవ్వకు ఇస్తున్నమని పేర్కొన్నారు. కేసీఆర్ దత్తత తీసుకుంటే.l జీ వితాలు మారుతాయని అను కుం డ్రు మాయమాటలు చెప్పి నట్టేట ముంచిండని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

గురువారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండ లం వాసాలమర్రిలో 205 మంది ల బ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మం జూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయనమా ట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఒక్క వారంలోనే వాసాలమర్రిని బాగు చేస్తున్నామని చెప్పారు. ఆగం చేసి న వాసాలమర్రిని అభివృద్ధి చేసి, చూపిస్తామన్నారు. ‘పేదోడి సొం తింటి కల సాకారం చేస్తున్నామని భూభారతి చట్టంతో భూములను కాపాడుతాం. ఆగస్టు లోపు భూ సమస్యలు మొత్తం పరిష్కరిస్త. త ప్పును ఒప్పుగా ఒప్పును తప్పుగా చేసి పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం చే సిన కేసీఆర్ మళ్లీ ప్రజలకు నమ్మిం చి మోసం చేయడానికి కుట్ర చేస్తుం డుని పొంగులేటి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలోరాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి బం డ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి,యాదాద్రి భు వన గిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అడిషనల్ కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, మదర్ డైరీ చైర్మన్,కాంగ్రెస్ సీనియ ర్ నాయకులు మరియు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.