ప్రజా దీవెన, హైదరాబాద్:
KCR: గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ చెకప్ కోసం మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఆయనకు వైద్యులు పలు టెస్టులు చేయగా ఈ క్రమంలోనే శనివారం కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వెంట కేటీఆర్, హరీశ్ రావు తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంట్లో కిందపడటంతో అప్పట్లో తుంటి ఎముకకు గాయం అయిన సంగతి తెలిసిందే.
కొద్దిరోజుల తర్వాత కోలుకున్న ఆయన ఫామ్ హౌస్ లోనే విశ్రాంతి తీసుకున్నారు. వయసు, ఆరోగ్యం కారణంగా కేసీఆర్ నీరసంగా కనిపిస్తున్నారు. నడిచేందుకు సైతం అప్పుడప్పుడు సెక్యూరిటీ సహాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనుండటంతో గులాబీ బాస్ బయటకు వస్తారా లేదా అన్నది ఆసక్తిక రంగా మారిన నేపద్యంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించు కుంటున్నట్లు తెలుస్తోంది.