–ఈ నెల చివరిలోగా ప్రెస్ అకా డెమీ భవనం ప్రారంభిస్తాం
–రాష్ట్ర సమాచార పౌర సంబంధా ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Journalist Housing Scheme :ప్రజా దీవెన, హైదరాబాద్: అర్హు లైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లే టి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రా మీణ ప్రాంతాలలో నిరుపేదలైన జ ర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహ ణలో చనిపోయిన జర్నలిస్టుల కు టుంబాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తామని తెలిపారు.
వృత్తి నిర్వహణలో చనిపోయిన జ ర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదా లకు గురై వృత్తి నిర్వహించలేని స్థి తిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవా రo నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టుల ను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యా చరణ రూపొందిస్తామని తెలిపా రు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజనికి తెలియ జేసే దాంట్లో ఎంతో మంది జర్నలి స్టులు ఆణిముత్యాలుగా పనిచే స్తున్నారని ప్రశంసించారు.
జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నా రని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అ సంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకా డమీ భవనాన్ని చిన్న చిన్న మరమ త్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివ రిలోగా ప్రారంభిస్తామని తెలిపారు.
విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కో ట్లను ఫీక్సడ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుం దని. జర్నలిస్టుల సంక్షేమానికి ఫి క్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధా రంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుం బాలకు చెందిన 597 మందికి రూ. 1,00,000/-తో పాటు అయిదు సం వత్సరాల వరకు, నెలకు రూ.30 00/- ల చొప్పున పెన్షన్, వారి పి ల్లలకు ట్యూషన్ ఫీజుల క్రింద 1 నుండి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు 1,000/-ల చొప్పు న గరిష్టంగా ఇద్దరికి అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8,98, 39, 000/-లు ఆర్థిక సహాయం అందిం చండం జరిగిందన్నారు.
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రా మసహాయం రఘురామ రెడ్డి మా ట్లాడుతూ ఈ సమాజంలో జర్న లిస్టు వృత్తి అత్యంత కీలకమైన దని తమ ప్రాణాలను లెక్క చేయ కుండా సమాచారాన్ని ప్రజలకు అం దిస్తున్నారని గడిచిన రెండు రోజు లుగా రెండు దేశాల మధ్య ఏం జ రుగుతుందో అన్న ఆతృతతో ఎ దు రుచూస్తున్న ప్రజలకు తమ ప్రాణా లను లెక్క చేయకుండా సమాచా రాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్న లిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వా లని జర్నలిస్టుల సంక్షేమానికి నిధు లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సం బంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.