–ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Educational Standards :ప్రజా దీవెన , నల్లగొండ టౌన్: మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం అధ్యాపకులు విద్యార్థులను ఉద్దే శించి ప్రసంగించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షల్లో విద్యా ఉపాధికి ప్రముఖ స్థానం ఉందని, తెలంగాణ అస్తిత్వా న్ని బలంగా చర్చకు తీసుకొచ్చిన ప్రధాన అంశాలుగా గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెర వేరాలంటే విద్యాలయాలు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ దిక్సూచిలా ముందుకు నడవాలని సూచిం చా రు. అధ్యాపకులు ప్రగతిశీల దృక్పథంతో సామాజిక మార్పుకు సార థులుగా ఆదర్శవంతంగా నిలవాల న్నారు.
ఉత్తమ పరిశోధనల ద్వా రా దిక్సూచిగా నిలిచే అవకాశాలు అన్వేషించాలన్నారు. విద్యార్థులు 75% హాజరు విధిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి, ప్రిన్సి పాల్ డా కె ప్రేమ్సాగర్, సుధారాణి, ఆచార్య ఆకుల రవి, డా వై ప్రశాం తి, డా హరీష్ కుమార్, డా మద్ది లేటి, డా మిరియాల రమేష్, ఆచా ర్య కొప్పుల అంజిరెడ్డి, డా సురేష్ రెడ్డి, డా లక్ష్మీ ప్రభ, డా శ్వేత, డా తిరుమల, డా కళ్యాణి, డా హైమా వతి, డా జయంతి తదితర అధ్యా పకులు, బోధనేతర సిబ్బంది విద్యా ర్థులు పాల్గొన్నారు.