Gadari Sundarayya : ప్రజా దీవెన, శాలిగౌరారం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని శాలిగౌరారం ఏపీఓ జంగమ్మ, ఈసీ వెంకటాచారి కోరారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపరిడెంట్ గాదరి సుందరయ్యకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.
జాతీయ గ్రామీణ ఉపాధి ఉద్యోగులకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఎంపీడీవోల ద్వారా పై అధికారులకు వినతిపత్రం ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఫస్ట్ తారీకు వరకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆదేశానుసారం పనులు చేస్తూ ఉపాధి కూలీలకు పని కల్పిస్తూన్న మాకు జీతలు లేక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే మూనెలల జీతాలు విడుదల చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎర్ర బుచ్చయ్య, బట్ట సైదులు,ఎర్ర యాదగిరి, ఇంద్ర కంటి సైదులు, ఉపేందర్,యానాల లింగమ్మ, నీరజ, విజయ, సుజాత, రామంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.