–సిలిండర్ పై 50 పెంపు
–జిల్లా లో 6.20 లక్షల గ్యాస్ కనెక్షన్లు
— నెలకు 1.60 లక్షల సిలిండర్ల వినియోగం
–గృహలక్ష్మి ఏతర వినియోగదారులపై 80 లక్షల భారం
Gas Connections : ప్రజాదీవెన నల్గొండ : వంటింట్లో గ్యాస్ ధర మండుతోంది. చమురు కంపెనీలు సిలిండ రకు రూ.50 పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.500కే సిలిండర్ అందివ్వడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తప్పనుంది. ఈ పథకం వర్తించని వారు మాత్రం భారం మోయాల్సిందే. పెరిగిన ధర నేటి నుండి అమల్లోకి రానుంది.
ఏడాది నుంచి స్థిరంగా..
గ్యాస్ ధరలు రెండేళ్ల కిందట భారీగా పెరగడంతో ప్రజలు సతమతమయ్యారు. 2023 అక్టోబరులో రూ. 974 ఉండే ధర నవంబరులో 1124 కు చేరింది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెరుగుతున్నాయంటూ పేర్కొంది. ఆ తర్వాత నెల రోజులకు రూ. 974కు తగ్గింది. ఇలా నాలుగు నెలలపాటు కొనసాగిన ధర 2024 మార్చిలో రూ.874కు తగ్గింది. అప్పటి
ఏడాది పాటు స్థిరంగా ఉంటూ వస్తుంది. కేంద్రం రూ. 47.80 రాయితీ ఇస్తూ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
–924కు చేరిన ధర…
గృహలక్ష్మి పథకం లబ్దిదారులపై మాత్రం పెరిగిన ధర ప్రభావం ఉండదు. రాష్ట్ర సర్కారు రూ.500కే సిలిండరు చెల్లిస్తోంది. ఆపైన రూ. 424లో కేంద్ర ప్రభుత్వం రాయితీ తీసివేయగా, మిగిలిన రూ.376 లబ్ది దారుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇది అదనపు భారమే. అయితే సిలిండరు బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒకరూ రూ. 924 చెల్లించాల్సి ఉంటుంది. గృహ లక్ష్మి పథకం వర్తించని వినియోగదారులు నల్గొండ జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో కుటుంబానికి సగటున రెండు నెలలకు ఒక సిలిండర్ చొప్పున వస్తుంది.
జిల్లాలో కనెక్షన్లు…
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు..
జిల్లాలో భారత్, హెచ్.పీ, ఇండియన్ మొత్తం 6. 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సుమారు 5 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో సుమారు 8 నుంచి 10 సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇలా ప్రతి నెలా 160000
ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ ప్రకారం ప్రజలపై 80 లక్షల భారం పడుతోంది.