Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ACB Raids: ఏసీబీ వలలో జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఏఈ

ప్రజా దీవెన, హైదరాబాద్:
ACB Raids: జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఏఈ స్వరూప రామ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి లక్ష 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప సదరు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి లక్ష 20 వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్ ను ఒత్తిడి చేయడంతో కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు దాటే లోపు ఏ ఈ స్వరూప ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని లక్ష 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఏ ఈ స్వరూప పై కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.