Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Goli Nagaraju : ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

Goli Nagaraju : ప్రజా దీవెన, కోదాడ: భక్త మార్కండేయ జయంతిని కోదాడ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గోలి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి సేవా సంఘం నాయకులు, కుల బంధువులతో కలిసి భక్త మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల కులదైవమైన మార్కండేయ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. పద్మశాలీల ఐక్యత కోసం మార్కండేయ చేసిన కృషి అభినందనీయమని వారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు నక్కా చంద్రం, పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు, పిండిప్రోలు శ్రీనివాస్, గిరి ప్రసాద్, గొర్రె రాజేష్, పతంగి నరేష్, ఎలగందుల నరసింహారావు, తాటి మురళి, వనం ప్రభాకర్, రత్నాకర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సైదులు, సురేష్, రాఘవయ్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.