–త్వరలో అక్రెడిటేషన్లు, ప్రొఫెషనల్ కమిటీల ఏర్పాటు
–టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృం దానికి మంత్రి పొంగులేటి హామీ
Journalists Welfare :ప్రజా దీవెన, హైదరాబాద్ : జర్న లిస్టుల సంక్షేమానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, ఒక్కొక్కటి గా వాటి పరిష్కారానికి కృషి చేస్తా మని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మా ణ, సమాచార మరియు పౌర సం బంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కిం గ్ జర్నలిస్టుల సంఘం (టీయూడ బ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. విరాహత్ అలీ, కే. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మం త్రి శ్రీనివాస్ రెడ్డితో సచివాలయం లోని ఆయన ఛాంబర్ లో సమావే శమై జర్నలిస్టుల వివిధ సమస్య లపై చర్చించింది.
ఎన్నికల సమ యంలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమా న్ని పొందుపర్చ డంతో జర్నలిస్టు లు ఎంతో హర్షించారని, అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అ వుతున్నా ఇంకా ఏ ఒక్క సమ స్యకు పరిష్కారం దక్క కపోవడం తో జర్నలిస్టుల్లో నిరాశ చోటుచేసు కుందని విరాహత్, రాం నారాయ ణలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రె డిటేషన్ల నియమావళి రూపకల్ప నా కోసం ప్రభుత్వం కమిటీ వేసింద ని, ఆ కమిటీ నివేదిక సమర్పించి నె ల రోజులు గడుస్తున్నా ఇంకా జీవో జారీ కాలేదన్నారు.
గత ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటే షన్లను ఏడా దిన్నర కాలంగా జర్న లిస్టులు రె న్యూవల్ చేసుకుంటు న్న పరిస్థితి నెలకొందన్నారు. వెంట నే కొత్త అక్రె డిటేషన్లు జారీ చేసేందు కు చర్యలు చేపట్టాలని వారు కోరా రు. జర్నలి స్టులకు ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీ ర్పు కేవలం అర్బన్ ప్రాం తాల్లో సొసై టీల వరకే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జ ర్నలిస్టులకు కాదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు తమ విధు లను స్వేచ్ఛగా నిర్వర్తిం చేందుకు గాను వారికి రక్షణ కల్పిం చేందుకు, సామాజిక సేవలో నిమ గ్నమైన జర్నలిస్టుల సంక్షేమం కో సం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు అనేక జీవో లు జారీ చేసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయని, గత పదేళ్లుగా వాటిని నిర్వీర్యం చేసారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జర్నలిస్టులపై దాడుల నిరోధక హైపవర్ కమిటీ, వర్కింగ్ జర్న లిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ, వేజ్ బోర్డు సిఫారసులను పర్యవేక్షించే త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చే యాలని వారు విజ్ఞప్తి చేశారు. చి న్న, మధ్యతరగతి పత్రికల బిల్లులు పెండింగులో ఉండడం, అప్ గ్రేడే షన్ ప్రక్రియ జరగక పోవడంతో వా టి నిర్వాహకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలి పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలం మునగనూ రు గ్రామ శివారులో ఎల్.బి.నగర్ జర్నలిస్టులకు ఏడాదిన్నర క్రితం ఇంటి స్థలాలు కేటాయించగా వా రు ఇండ్లను సైతం నిర్మించుకున్నా రని, అయితే ఆ స్థలాలను ఖాళీ చేయాలని గత కొన్ని రోజుల నుం డి రెవెన్యూ అధికారులు లబ్దిదా రులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని, వెంటనే ఈ సమస్య కు పరిష్కారం చూపాలని వారు మంత్రిని కోరారు.
టీయూడబ్ల్యూజే విన్నవించిన ఆ యా సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి, త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతి నిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కే. శ్రీకాంత్ రెడ్డి, జి. మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు ఏ. రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షు లు యూసుఫ్ బాబు, రాష్ట్ర నాయ కులు మాతంగి దాస్, హెచ్.యూజే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు పా ల్గొన్నారు.