BJP leader Ramchander rao: ప్రజలను మాయమాటలతో మోసగించిన ప్రభుత్వం
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుందని భాజపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ నారపరాజు. రామ్ చందర్ రావు అన్నారు.
కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలకు కనువిప్పు కలిగేలా తీర్పు ఇవ్వాలి.
రామ్ చందర్ రావు.
ప్రజా దీవెన, కోదాడ: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ(congress party) అధికారం దక్కించుకుందని భాజపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామ్ చందర్ రావు(Ram chander rao) అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి పార్టీ అభ్యర్థి గుజ్జుల. ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఐదు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన6 గ్యారంటీల హామీలను నెరవేర్చలేక పోయిందన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు.
రాష్ట్రంలో భాజపా పుంజుకుంటుందని పార్లమెంటు ఎన్నికల్లో(Parliament elections) బిజెపి పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అలాగే దేశవ్యాప్తంగా 400 పైగా స్థానాలు గెలిచి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని(PM Narendra modi) అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నిబద్ధతగల నాయకుడు శాసనమండిలో పోరాడే సత్తా ఉన్న గుజ్జుల. ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ. భాగ్యరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల కోదాడ అసెంబ్లీ ఇన్చార్జ్ విద్యాసాగర్, కోదాడ అసెంబ్లీకన్వీనర్ కాగాల నారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు. యశ్వంత్, సీనియర్ నాయకురాలునూనె.సులోచన,కవితా రెడ్డి, ఓరుగంటి. కిట్టు తదితరులు పాల్గొన్నారు.
Government deceived people with lies