Government Schemes : ప్రజా దీవెన, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంది రమ్మ ఇండ్ల పథకాలకు గ్రామ/ వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మంగళ వారం మున్సిపల్ పరిధిలోని స్థానిక నాల్గవవార్డులో ప్రారంభించినారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి పాల్గొని లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం క్రితం నుండి ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన సర్వేలో అర్హత ఉన్న వారి పేర్లను వార్డు సభల్లో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలలో ఆయా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్ల యితే నమోదు చేస్తున్నామన్నారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని,ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కోదాడ మున్సిపల్ పరిధిలో వార్డుసభలు 21వ తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహిస్తున్నామని వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారికోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కౌంటర్ నందు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బత్తిని హనుమంతరావు రెవిన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున మహిళలు గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు