Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Indiramma Houses :ప్రభుత్వం కీలక నిర్ణయం, త‌ర‌త‌రా లుగా గూడులేని చెంచుల‌కు 10వే ల ఇందిర‌మ్మ ఇండ్లు

Indiramma Houses :ప్రజా దీవెన హైదరాబాద్: త‌ర‌త‌రా లుగా సొంత ఇండ్ల‌కు నోచుకోని ఆ దిమ గిరిజ‌న తెగ‌ల‌లోకి అతి బ‌ల‌ హీన వ‌ర్గ‌మైన చెంచుల‌ సొంతింటి క‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భు త్వం సాకారం చేయ‌బోతోంద‌ని రె వెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. రా ష్ట్రంలోని ఉట్నూరు, భ‌ద్రాచ‌లం, మున్న‌నూర్‌, ఏటూరు నాగారం నాలుగు స‌మ‌గ్ర గిరిజ‌నాభివృద్ధి సంస్ధ ( ఐటిడిఎ)ల ప‌రిధిలో స‌చ్యు రేష‌న్ ప‌ద్ద‌తిలో దాదాపు ప‌దివేల చెంచు కుటుంబాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని వీరంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

ఇందిర‌మ్మ ఇండ్ల‌పై మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజ‌న ప్రాం తాల్లో శాశ్వ‌త గృహాల‌ను నిర్మించా ల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ గారు ప‌లు సంద‌ర్బాల‌లో సూచిం చ‌డం జ‌రిగింద‌ని అలాగే రాష్ట్ర ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అనే క సంద‌ర్బాల‌లో గిరిజ‌న ప్రాంతాల‌ లో అభివృద్ది, ముఖ్యంగా వారి ని వాస గృహాల నిర్మాణంపై అనేక సూచ‌న‌లు చేశార‌ని గ‌వ‌ర్న‌ర్, ము ఖ్య‌మంత్రి సూచ‌న‌లు స‌ల‌హాల మే ర‌కు గిరిజ‌న ప్రాంతాల్లో చెంచులకు ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చే స్తున్నామ‌ని తెలిపారు.

అడవులను నమ్ముకొని జీవించే గి రిజనులలో చెంచులు ఒక జాతి అ ని, వీరు అడవుల్లో వేటాడటం, అ టవీ ఫలసాయం సేకరించి అమ్ము కొని జీవనం సాగిస్తున్నార‌ని, చిన్న చిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అం దని విషయమ‌ని, అలా అని ఆ అ డవి ప్రాంతాల్ని వదలి వారు బతక లేరు. అందుకే వీరు జీవించే ప్రదేశం లోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా లని ప్రభుత్వం నిర్ణయించింద‌ని, ద శాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేద‌న్నారు.

ఉట్నూరు ఐటిడిఎ ప‌రిధిలో ఆసి ఫాబాద్ 3551, బోధ్ 695, ఖానా పూర్ 1802, సిర్పూర్ 311, అది లాబాద్ 1430, బెల్లంప‌ల్లి 326, భ‌ ద్రాచ‌లం ఐటిడిఎ ప‌రిధిలో అశ్వ‌రా వుపేట 105, మున్న‌నూర్ చెంచు స్పెష‌ల్ ప్రాజెక్ట్ లో అచ్చంపేట్ 518, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 153, ప‌రిగి 138, తాండూర్ 184 మొత్తం 9,395 ఇం డ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌ క‌టించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇం దిర‌మ్మ ఇండ్లును మంజూరు చేస్తు న్నామ‌ని, అయితే ఐటిడిఎ ప‌రిధి లోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డిం చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చింద‌ని అయితే ప్ర‌తి నియోజ‌క‌ వ‌ర్గంలో 3500 ఇండ్ల‌కు గాను 20 శాతం ఇండ్ల‌ను బ‌ఫ‌ర్ కింద పెట్టుకో వ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మా ణంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణంలోని ముఖ్య ప్రాంతాల‌లోని మురికి వాడ‌ల్లో జీవ‌నం కొన‌సాగిస్తున్న పేద‌లు అ క్క‌డే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నా ర‌ని, హైదరాబాద్ కు దూరంగా ఇం డ్లు నిర్మించి ఇస్తే తీసుకోవ‌డానికి ఆ స‌క్తి చూప‌డం లేద‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం కొల్లూరులో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి హైద‌రా బాద్‌లో ఉన్న‌పేద‌ల‌కు కేటాయిస్తే వాటిని తీసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌న్నారు. వీ ట‌న్నింటినీ దృష్టిలో పెట్ట‌కొని పేద‌ లు గుడిసెలు వేసుకొని నివ‌సిస్తున్న ప్రాంతంలోనే జీ ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాల‌ని భావి స్తున్న‌ట్లు తెలిపారు.