Graduates MLC by-election polling: ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియో గించుకుంటున్నారు.
నార్కట్ పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై దాడి మినహా ప్రశాంతం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియో గించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభ ద్రులంతా కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు. ఓటువేసే వాళ్లు అక్షరాస్యు లు కావడంతో వాళ్లంతా అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేసే అవకాశం ఉండ టంతో పార్టీలు వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టేవికాదు. కానీ గత కొతంకాలం గా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా యి. శాసనసభతో పాటు శాసన మండలిలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
పార్టీలు ప్రతిష్టాత్మకం గా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్ని కలు సాధారణ ఎన్నికల వాతావర ణాన్ని తలపిస్తున్నాయి. 2021లో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభ ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మె ల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పరకాల నుం చి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనా మాచేశారు. దీంతో వరం గల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్ని్క పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం 4 లక్షల 63 వేల 839 మంది ఓట్లర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2021తో పోలిస్తే దాదాపు 40 వేల మందికిపైగా ఓటర్లు తగ్గారు. గతం లో బోగస్ ఓట్లు నమోదయ్యాయం టూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి బోగస్ ఓట్లు తీసేయడంతో ఓట్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. బోగస్ ఓట్లతోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారం టూ ప్రత్యర్థులు ఆరోపించారు. ప్రస్తుతం 40వేలకు పైగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఫలితాల తర్వాత తేలనుం ది. గత ఎన్నికల్లో 74 శాతం పోలిం గ్ నమోదుకాగా ఈసారి సాయంత్రం కడపటి సమాచారం అందే వరకు శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
ఓటు వినియోగించుకున్న ప్రముఖులు….
ఈ ఎన్నికలలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఓటు వేశారు.భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న దంపతులు, హన్మ కొండలో బిఆర్ఎస్ అభ్యర్ధి ఏను గుల రాకేశ్ రెడ్డి దంపతులు, ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్, నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన , హను మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాప ట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆయా జిల్లా కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం కేంద్రంలో పలువురు పట్టభద్రులతో తుంగతుర్తిఎంఎల్ఎ ముచ్చటించారు.
నార్కట్ పల్లి లో ఉద్రిక్తత…
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసు కుంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్గౌడ్పై కాంగ్రెస్ నేతల దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేశారని అశోక్గౌడ్ ఆరోపి స్తున్నారు. స్థానిక డోకూరు గార్డెన్ లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లానని ఆయన చెబు తున్నారు.ఎందుకు డబ్బులు పంచుతున్నారని అడిగినందుకు తన ఫోన్లు ధ్వంసం చేసి, దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిం చారు. నార్కట్పల్లి పీఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Graduates MLC by-election polling