Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rythu Sambaralu : నల్లగొండ జిల్లాలో ఘనంగా రైతు సంబరాలు

–ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతా వత్ శంకర్ నాయక్

Rythu Sambaralu : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: టిపిసిసి ఆదేశాల మేరకు మంగళ వారం జిల్లాలోని అన్ని మండల కేం ద్రాల్లో రైతు సంబరాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిం చాలని ఎమ్మెల్సీ,డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పా ర్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ లో జోష్ పెరిగిందన్నారు. సోమ వారం నల్లగొండ లోని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కా ర్యాల యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మా జీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వా స్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసాతో రైతుల జీవితాలలో కాంగ్రెస్ ప్రభు త్వం వెలుగులు నింపుతుందన్నా రు.ఇప్పటివరకు రైతు భరోసా కింద 6,300 కోట్లు రైతుల ఎకౌంట్లో జమ అయిందని వెల్లడించారు. అదేవి ధంగా 2,400 కోట్లు రుణమాఫీ జరి గిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందు కు పోతుందన్నారు.రైతు సంక్షేమ మే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రా ష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బి ఆర్ఎస్, బిజెపి పార్టీలు జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ భూములకు మాత్రమే న్యాయం చేస్తుందని అ న్నారు. కాంగ్రెస్ మీద అబండాలు వేయడం సరైనది కాదని సూచించా రు. కాంగ్రెస్ పాలనలో రైతులు. ప్రజ లు సంతోషంగా ఉన్నారని తెలిపా రు. బి ఆర్ ఎస్ 15 ఏళ్ల పాలనలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని. అదేవిధంగా నిరుపేదలకు ఇల్లు కూ డా ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 35 00 ఇండ్లు మంజూరు చేయడం జరి గిందని, త్వరలో 20 లక్షల ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపా రు. రాజకీయపరంగా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చే సిందని. త్వరలో జరగబోయే స్థాని క సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వి జయం సాధించడం ఖాయమని తె లిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమ లు చేస్తుందని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా మండలంలోని నా యకులు, కార్యకర్తలు రైతు సంబ రాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. సందర్భంగా పాలాభిషే కాలు నిర్వహించాలని ఆయన పి లుపు నిచ్చారు. ఈ విలేకరుల స మావేశం లో మార్కెట్ చైర్మన్ జూ కూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వం గూరు లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ కిసా న్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, ఆర్టిఏ రీజనల్ డైరెక్టర్ కూ సుకుంట్ల రాజిరెడ్డి, యువజన కాం గ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షు డు మామిడి కార్తీక్ తో పాటు పలు వురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.