*కోదాడకు పరీక్షా కేంద్రాలను కేటాయించటంతో పండుగ వాతావరణం సంతరించుకుంది
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ టు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది మొత్తం పట్టణంలో 19 పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగింది 19 పరీక్షా కేంద్రాలలో మొత్తం అభ్యర్థులు 7887 మందికి గాను ఉదయం నిర్వహించిన పరీక్షకు 3605 మంది హాజరు కాగా 4,282 మంది గైరాజరయ్యారు.
అలాగే సాయంత్రం పూట నిర్వహించిన పరీక్షకు 3,595 మంది హాజరు కాగా 4, 292 మంది గైరాజరయ్యారు పట్టణములోని నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు 144 సెక్షన్ అమలు చేశారు.