— శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం ఏ రాష్ట్రంలో నిర్వహించిన విధంగా 94,863 ఎనిమినేటర్స్ 9628 సూపర్వైజర్స్, 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా కేవలం 50 రోజుల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో 97% ప్రజలు 97శాతం వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వ నిర్వహించిన సర్వే లెక్కలు సరి కావడం లేదు, దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓట్ల హక్కు ఉండటం, ఓటర్ జాబితాని ఆధార్ కి మనసంతానం చేయకపోవడం ఒక ప్రధాన కారణం. గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ని ఇచ్చి ఇస్తుంది అలాగే బిపిఎల్,ఏపీఎల్ కార్స్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి కి లేఖ రాశాను. దీనికి సీఎం అనుకూలంగా స్పందించారు.
బిపిఎల్,ఎపిఎల్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,728 గ్రామపంచాయతీలో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలు 2625 అంటే 20.62 శాతం, కానీ మొత్తం బీసీ అభ్యర్థులకు గెలిచిన స్థానాలు 4274 అంటే 33%శాతం,అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 571 అందులో బీసీలకు కేటాయించిన స్థానాలు 12 24 అంతే 21% కానీ బీసీ అభ్యర్థులు జనరల్ స్థానాలు వారికి కేటాయించిన సీట్లు అన్నీ కలిపి 22 అంటే 38% గెలిచారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి.అధికారులు ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం సబబు కాదన్నారు.