— శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో లక్ష్మీ గార్డెన్స్ అమ రజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం, కామ్రేడ్ ఎన్ బలరాం వేదికలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆరవ విద్య వైజ్ఞానిక మహాసభలు అట్టహాసంగా జరి గాయి. గడియారం సెంటర్ నుండి వేల కొలది టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు మహా ప్రదర్శనగా లక్ష్మీ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు జాతీయ పతాక ఆవిష్కరణ, పి విద్యాసాగర్ రెడ్డి టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎస్ టి ఎఫ్ ఐ పతాకావిష్కరణ, వి బంగారయ్య టీఎస్ యుటిఎఫ్ పతాకావిష్కరణ చేసిన అనంతరం టీఎస్ యుటిఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన ప్రారంభ సభ ప్రారంభ మైంది.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆర వ మహాసభల ప్రారంభ సమావే శంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుం దని, ఒక కుటుంబంలో ఒకరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారని, సుమారు 18.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, అనేక కారణాలవల్ల డ్రాప్స్ పెరుగుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల లో మౌలిక సదుపాయాల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని, పారిశుద్ధ కార్మికులు, కాపలాదారు లేక ఇబ్బందికరమైన పరిస్థితులలో పాఠశాలలు ఉండేవని, కొత్త ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులను నియమించిందని, నూతన డీఎస్సీ ద్వారా పదివేలకు పైగా కొత్త ఉపాధ్యాయులు నియమించబడ్డారని, రెసిడెన్షియల్ మోడల్, స్కూల్స్లలో 10,000 మంది ఉపాధ్యాయులు నియమించబడ్డారని, గతంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు, బదిలీల సమస్య ఈ ప్రభుత్వంలోనే పరిష్కారం అయిందని అన్నారు, 317 జీవోలో సమస్యలు ఉన్నాయని, డిసెంబర్ 31 లోపు స్పౌజ్ సమస్య పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 66% అక్షరాస్యత ఉన్నదని దానిని 100% గా సాధించుటకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేయాలని, రాష్ట్ర నిర్మాణంలో టీచర్ల పాత్ర గణనీయమైందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యనందించుటలో కృషి చేయడం ద్వారా డ్రాప్స్ తగ్గించ గలుగు తామని అన్నారు. అనంతరం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాస భల ఆహ్వాన సంఘం చైర్మన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ సాయిధ రైతంగా పోరాటంలో పాల్గొన్న చరిత్ర నల్ల గొండ జిల్లా కు ఉందని, మట్టి పిసికే చేతులే పోరాటాలు చేశాయని, వీర నారి చాకలి ఐలమ్మ పేరిట మహి ళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విప్లవ కింద పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ఆరవ రాష్ట్ర మహా సభలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, దేశం ఐక్యంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని, ఆ దిశలో కేంద్ర ప్రభు త్వం ఆలోచించడం లేదని, మత విశ్వాసాలను మూఢనమ్మ కాలను పెంచి పోషించే విద్యా విధానం ప్రమాదకరమని, విద్యా విధానం కాషాయీకరణ చేయడం సరికాద ని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని నిలబె ట్టడానికి కృషి చేయడం హర్ష నీయమని, విద్యకు బడ్జెట్లో కొంత పెంచినప్పటికీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధే శిరోద్యారమని దానిని పునర్దించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వము సమాన బాధ్యతలు తీసుకోవాలని, గత పది సంవత్సరాలలో కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయలేదని, వాటిని అమలు చేసినప్పుడే విద్యారంగంలో అనేక సమస్యలు పరిష్కరించబడతాయని పాఠశాల విద్య, ఉన్నత విద్య గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని సరిదిద్దాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించే నూతన విద్యా విధానం NEP 2020 వల్ల పేద పిల్లలు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని, కార్పొరేట్ శక్తులతో విద్య వ్యాపార వస్తువుగా మారిందని అన్నారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు పూర్తి అయిందని తెలంగాణ రాష్ట్రంలో ఆరవ విద్య వైజ్ఞానిక మహాసభలు నల్లగొండలో జరుపుకుంటామని కొత్త ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీల సమస్య తీరిందని 33 జిల్లాలలో 22 జిల్లాలకు డీఈవోలు లేరని రాష్ట్రంలో 63 మంది డిప్యూటీవోలు లేరని 640 మండలాలలో కేవలం 14 మంది రెగ్యులర్ ఎంఈఓ లు మాత్రమే ఉన్నారని విద్యా వ్యవస్థ అంతయు ఇన్చార్జిలతోనే నడుస్తుందని, ప్రవేట్ పాఠశాలల మోజులో 1800 స్కూల్స్ బూత పడ్డాయని అన్నారు. పట్టణ ప్రాంతాలలో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్న ఉపాధ్యాయులు లేరని గ్రామ ప్రాంతాల్లో సరిపోను ఉపాధ్యాయులు ఉన్న పిల్లలు లేరని గత ప్రభుత్వ హయాంలో పేద పిల్లలు విద్యకు దూరమైందని కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలు 100% అక్షరాస్యత సాధించాయని నేటి వరకు మన దేశంలో 67% అక్షరంతో మాత్రమే అధిగమించేందమని 70 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం ద్వారా ఏమి సాధించామని అనుకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఫలితంగా విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని ప్రవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు అనుమతినిచ్చి ప్రభుత్వ పాఠశాలలో అనుమతించకపోవడం శోచనీయమని 82 కోట్ల మందికి దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ కేటాయించడం దేశ అభివృద్ధికి ఆటంకం అని అన్నారు.
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లా డుతూ వ్యక్తి అభ్యున్నతికి, సమా జ వికాసానికి విద్య అవసరమని ఉపాధ్యాయుడు వేసే పునాదుల ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుందని పాఠ్యాంశాలలో చేర్చాల్సిన అంశాలను ఉపాధ్యాయులు సూచించాలని ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల నియంత్రించే చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలో బోధన చేయాలని అన్నారు.
తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీష్ మాట్లాడుతూ 206 సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేశామని పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రంగా ఉందని దాని సాధనకు జేఏసీ ద్వారా పోరాటాలు చేస్తున్నామని రెండవ పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని ఈ హెచ్ ఎస్ ను కార్పొరేట్ హాస్పిటల్లో అమలు చేయాలని పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని భిక్ష కాదని సుప్రీంకోర్టు చెప్పిందని వారి సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.ఏపీ యుటిఎఫ్ అధ్యక్షులు నక్క శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను రెండు తెలుగు రాష్ట్రాలలో నాశనం చేసే విధానాలు అమలు చేస్తున్నారని యుటిఎఫ్ ఆధ్వర్యంలో చెన్నుపాటి వారసులుగా ప్రభుత్వ విద్య విధానాన్ని కాపాడుకుందాం అని రాజ్యాంగ ని కూడా కాపాడుకుందామని అన్నారు.
ఎస్టిఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త గమాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూడో విశ్వాసాలు అధికంగా ఎక్కడ ఉన్నాయో అక్కడ అభ్యుదయ ఉద్యమాలు కూడా వస్తున్నాయని ఎస్టిఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సిపిఎస్ వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని అందరికీ నాణ్యమైన సమానమైన విద్య విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు.
టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ పెన్షనర్లకు నాలుగు డీఏలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ హ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ NEP 2020 విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ విద్యను ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని దీనిద్వారా మత విశ్వాసాలు పెంపొందించ బడతాయని, శాస్త్రీయ విద్యను ప్రోత్సహించే విధంగా విద్య ఉండాలని అన్నారు. కొత్త విద్యా విధానం ద్వారా రిజర్వేషన్లు ఉండవని, విద్యకు పేదలు దూరమవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టి జి ఎస్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు కార్యదర్శులు కే సోమశేఖర్ ఏం రాజశేఖర్ రెడ్డి జి నాగమణి రాష్ట్ర ఆడిట్ కమిటీ యాకయ్య, సాంస్కృతి కమిటీ కన్వీనర్ నల్లా నరసింహ పాల్గొన్నారు.