ప్రజా దీవెన, కోదాడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి హడ్సరాణి అన్నారు. బి ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కళాశాలలో అంబేద్కర్ చిత్రపటానికి అధ్యాపకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ న్యాయం తో పాటు అందరికీ విద్యా, ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేసిన గొప్ప న్యాయ శాస్త్రవేత్త అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు, అధ్యాపకులు బి.సైదిరెడ్డి, నిర్మల కుమారి, శ్రీలత, సత్యవాణి, పిడి ఫ్రాన్సిస్, లైబ్రేరియన్ మాతంగి యాకోబు, పల్లపాటి సైదులు,సైదమ్మ, ఎస్ఎం రఫీ, కేలోతు సైదులు, టి రాజు,సుమలత,ఆకుల రాజు, జి ఎల్ ఎన్ రెడ్డి, సూపరిండెంట్ యాదమ్మ, అధ్యాపకేతర సిబ్బంది బాలరాజు,ఇస్మాయిల్, వేణు,విద్యార్థులు పాల్గొన్నారు