Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Handloom societies : చేనేత సంఘాల ఎన్నికలు నిర్వహించాలి

Handloom societies

— వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి
Handloom societies: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం (Telangana Handloom Workers Union) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్, గంజి మురళీధర్ డిమాండ్ చేశారు సోమవారం దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగిన విలేకరుల (Reporters) సమావేశంలో వారు మాట్లాడుతూ మనదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మం దికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బిజెపి అధికా రంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERMENT) కొత్త పథకాలు ప్రకటించక పోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయో గపడే హ్యాండ్లూమ్ బోర్డు ను, పవర్లూమ్ బోర్డ్ ను, మహాత్మా గాంధీ బున్కల్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనే త వస్త్రాలపై రంగులు రసాయనా లు నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు.

2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు (ELECTIONS) ఐదు సంవత్స రాల కాలపరిమితి ముగిసిన ఆరు నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్చా ర్జిల నియమించి పొడిగించడం పొడిగించుకుంటూ ఇప్పటికి 9 సార్లు పొడిగించడం వలన సహ కార సంఘాలు నిర్వీర్యమైపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘా లకు సహకార ఎన్నికల నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలవపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల మరియు మాస్టర్ వీవర్స్ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు నిలువలు పేరుకపోయాయని మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ (DEMAND) చేశారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ ఫoడ్, చేనేత మిత్ర పథకాలకు (Handloom Mitra Schemes) నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్ లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబా రక్, గురుకులాలు ,ప్రభుత్వ పాఠశా లల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించి ఆదుకో వాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి వెంటనే 80 శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో 2000 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్య దర్శి దండెంపల్లి సత్తయ్య చేనేత కార్మిక సంఘం ( Telangana Handloom Workers Union) నాయకులు రాపోలు రాములు ,రాపోలు వెంకన్న కర్నాటి శ్రీరంగం గడ్డం దశరథ వాలిగొండ మధు బొల్లు రవీంద్ర కుమార్,శివ, తదితరులు పాల్గొన్నారు.