Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hanuman Jayanti : బండి సంజయ్ హాట్ కామెంట్స్, రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త

–హిందూ సమాజ సంఘటితం కోసం పోరాడే నాయకుడు
–పేదలకు ఇచ్చేది ముమ్మాటికీ మోదీ బియ్యమే
–కేటీఆర్ హెచ్ సీయూ భూముల బ్రోకర్ ఎవరో, అవినీతిసహా ఆధా రాలు బయటపెట్టే దమ్ములేదా
–హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు వెళ్లింది ఏబీవీపీ, బీజేపీ నాయకులే
–ఎమ్మెల్సీ రాజాసింగ్ తో కలిసి ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి

Hanuman Jayanti : ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా మీరు మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెల వాలనుకుంటున్నారు కదా మీకు ఓట్లేసి గెలిపించేది హిందువులే త ప్ప అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు కాదనే విషయాన్ని గుర్తుం చుకోవాలని, ఒకవేళ జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎంఐఎం అభ్యర్ధికి ఓటేస్తే హిందు సమాజ మంతా ఒక్కటై మిమ్ముల్ని ఓడిం చడం తథ్యమoటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ హెచ్చరించారు. హిందూ ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి సందర్భంగటా హిందూ సమాజమంతా ఏ విధంగా ఏకమ వుతుందో ఒక్కసారి గుర్తుంచుకుని ఓటేసే ముందు ఆలోచించుకోవా లని సూచించారు. ఓటేసే ముందు కార్పొరేటర్లంతా తమ తమ డివిజ న్ ప్రజలతోపాటు కుటుంబ సభ్యు ల మనోభావాలను తెలుసుకుని ఓ టేయాలని కోరారు.

హనుమాన్ జయంతిని పురస్కరిం చుకుని కొద్దిసేపటి క్రితం గోషామ హల్ నియోజకవర్గంలోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయానికి విచ్చే సిన బండి సంజయ్ కు స్థానిక ఎ మ్మెల్యే రాజాసింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజాసింగ్ తో కలిసి ఆంజనేయస్వామి ఆల యాన్ని దర్శించుకున్నారు. అనంత రం రాజాసింగ్ తో కలిసి మీడియా తో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం సారాంశం ఆయన మాటల్లోనే..

ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ పవర్ పుల్ ఆలయం. గతంలో ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు వచ్చిన. ఇక్కడికి వస్తే నా వెంట్రుకలు నిక్క బొడుస్తున్నాయి. హనుమాన్ జ యంతి సందర్భంగా ఇక్కడికి రావ డం జరిగింది. హిందూ సమాజ సం ఘటిత శక్తిని ప్రదర్శించేలా చరిత్ర స్రుష్టించే రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గొప్ప ర్యాలీ నిర్వ హించారు.

దేశవ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తారు. సంఘ విద్రోహ శక్తు ల నుండి కాపాడే దైవం హనుమం తుడు. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

కేటీఆర్ కు నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయటపెట్టొచ్చు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సం బంధించిన ఆధారాలు ఎందుకు బ యటపెట్టలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే.

కేటీఆర్ కు కళ్లు దొబ్నినయ్. రేవం త్ రెడ్డి సర్కార్ పై పోరాడుతున్నది బీజేపీయే కదా 6 గ్యారంటీలపై అ డుగడుగునా నిలదీస్తోంది మేమే క దా హెచ్ సీయూ భూములపై పోరా డి జైలుకు పోయింది మేమే కదా అ సెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా, వాకౌట్ చేసిందా ప్రతిరోజు 6 గ్యారంటీల హామీల ఎగవేతపై కాంగ్రెస్ ను నిల దీస్తోంది నేనే. రైతులకు రుణమా ఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500లు, విద్యార్థులకు రూ.5 ల క్షల భరోసా కార్డు, 2 లక్షల ఉద్యో గాలపై నిరంతరం మాట్లాడింది, పో రాడింది బీజేపీయే కానీ మీరేనా డై నా పోరాడారా అంతెందుకు హెచ్ సీయూ భూములపై పోరాడి జైలు కు పోయింది ఏబీవీపీ కార్యకర్తలే. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పో రాడారా, అయినా నేను అడు గు తున్నా మీడియా వాళ్లను పట్టు కుని కేటీఆర్ ‘‘వాడెవడో పేపరోడు, వీడెవడో టీవోడు’ ఆ బీజేపోడు అంటూ అడ్డగోలుగా మాట్లాడు తుంటే జర్నలిస్టులు స్పందించరా? కేటీఆర్ ను ప్రజలు ఓడగొట్టినా ఇం కా అహంకారం తగ్గలేదు. కేసీఆరే ఇంకా అధికారంలో ఉన్నడని అను కుంటున్నడేమో ఆయన అహంకా రం దించుతం.

రేవంత్ రెడ్డిగారికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ యన మెప్పు పొందేందుకు మోదీపై ఇష్టానుసారం మాట్లాడుతున్నడు. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే మో దీపై అడ్డగోలుగా మాట్లాడితే ఏ మైంది అభివ్రుద్ధికి సహకరిస్తానని కేంద్రం చెప్పినా వినకుండా అన్యా యం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో నడుస్తోంది. ఆ పార్టీకి కూడా ఆదే గతి పడు తుంది.

ఈ అంశం కోర్టులో ఉంది. ఈ భూ ములను ఎట్టి పరిస్థితుల్లోనూ అ మ్మనీయబోం. కోర్టులపై మాకు పూ ర్తి నమ్మకం ఉంది.రేషన్ ద్వారా అ మ్మే బియ్యంలో ఒక్క కిలోకు రూ. 37లు ఇస్తోంది కేంద్రమే కదా ఆ మాట సంబంధిత మంత్రి కూడా ఒప్పుకున్నారు కదా మరి కాంగ్రెస్ బియ్యం ఎట్లా అయితయ్. కాంగ్రెస్ ఎన్ని చెప్పినా రేషన్ షాపులో ఇ చ్చేది మోదీ బియ్యమే తప్ప రేవం త్ రెడ్డి బియ్యం, ఉత్తమ్ బియ్యం, కాంగ్రెస్ బియ్యం అని చెప్పడం లే దు. ఎందుకంటే ప్రతి ఏటా వేల కో ట్ల రూపాయలు బియ్యం కోసం కేం ద్రం ఖర్చు చేస్తోంది. ఒకవేళ రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర ని ధులు అక్కర్లేదని అనుకుంటే ద మ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలి. ‘‘మీ బియ్యం మాకు అవసరం లే దు. అందుకోసం కేంద్రం పైసలి య్యాల్సిన అవసరం లేదు. ఆ బి య్యానికి అయ్యే పైసలన్నీ మేమే భరిస్తాం. ఖర్చు పెడతామని కేం ద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ ప్ర భుత్వానికి ఉందా సమాధానం చె ప్పాలి.

రాజాసింగ్ బీజేపీ సీనియర్ నేత. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నాయకుడు. 2018లో మా ఏకైక ఎమ్మెల్యే. సమాజ ధర్మం, బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త రాజాసింగ్. హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయ కుడు. ఆయనతో ఎలాంటి విబేధా ల్లేవు. బీజేపీలో అందరం కలిసే ఉంటున్నాం.

ఇప్పటికే మేం తెలంగాణలో 50 శాతానికిపైగా ప్రాంతాల్లో ప్రాతి నిధ్యం వహిస్తున్నాం. 3 ఎమ్మె ల్సీలు మావే. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తోంది కూడా బీజేపీ యే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చే యడానికి అభ్యర్థులే దొరకడం లే దు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎ మ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు అభ్య ర్థులనే నిలబెట్టకపోవడమే నిదర్శం కదా ఇంకా ఆయన అడుగుపెట్టని చ్చేదేముంది.

మా బలమేందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నే తేలిపోయింది. మాకు బలం ఉం ది కాబట్టే మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్ని కల్లో గెలిచినం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బలం లేదు కాబట్టే పోటీ చేయ డానికి కూడా అభ్యర్థులే దొరకడం లేదు. ఎవరికి బలముందో ఇంతకం టే నిదర్శనం ఏం కావాలి.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఒకటే కోరుతున్నా మీ గుండెపై చేయి వేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎంఐఎం పార్టీకి ఓటేయమని అడ గండి. మీరంతా మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటు న్నారు కదా మరి మీకు హిందు వుల ఓట్లు వద్దా అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు మిమ్ముల్ని గెలిపి స్తారనుకుంటున్నారా లేక రేవంత్ రెడ్డి, కేటీఆర్ గెలిపిస్తారనుకుంటు న్నారా మిమ్ముల్ని గెలిపించేది హిం దువులే కదా ఒకవేళ పొరపాటున ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తే హిందు సమాజం క్షమించదు. హిందూ ఏ క్తా యాత్ర, హనుమాన్ జయంతి, వినాయక చవితి సందర్భంగా హిం దూ సమాజమంతా ఎట్లా ఏక మైతదో మీకు తెలుసు కదా పొ రపాటున మీరు ఎంఐఎంను గెలి పిస్తే హిందువులంతా ఒక్కటై మి మ్ముల్ని ఓడించడం తథ్యం. ఈ విషయాన్ని ఆలోచించండి ఎవరికి ఓటేయాలో నిర్ణయం తీసుకోవాల ని కోరుతున్నా.