–ఎమ్మెల్యే సునితపై దాడిని ఖం డించిన కెటిఆర్, హరీష్ రావు
Harish Rao: ప్రజా దీవెన, నర్సాపూర్: కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే తమ ఇంటి ముందు టపాసులు పేల్చారని, లోపలకు వచ్చి ఇద్దరిపై దాడి చేశా రని, ఇది కావాలని చేసిన దాడి అని నర్సాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎ స్ నేత సునీతా లక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy)అన్నారు. మెదక్లో ఆమె మీడియాతో మా ట్లాడుతూ గోమారంలోని తన ఇం టిపై దాడి జరిగిందని వాపో యా రు. గేటు లోపలకు వచ్చి మరీ దా డి చేశారన్నారు. మహిళా ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం, కావా లని టపాసులు పేల్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ (demand) చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హె చ్చరించారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్య క్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశా రన్నారు. ఇదిలా ఉండగా సునీతా లక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy)ఇంటిపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆమెను పరామర్శించారు. సోమవారం ఉద యం ఆయన హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు వెళ్లి జరిగిన సంఘ టన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, సు నీతా లక్ష్మారెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీ ఆర్ మాట్లాడుతూ దాడికి పాల్ప డిన కాంగ్రెస్ గూండాల పై కేసు న మోదు చేసి కఠిన చర్యలు తీసుకో వాలన్నారు.