Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరి ట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభు త్వo లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలన్నీ రెండు నాలు కల ధోరణికి మరో నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగో లుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టింద న్నారు. హరీష్ రావు చేసిన పలు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మేము అధికారం లోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్ము ను దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థం. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వలన రియల్ ఎస్టేట్ కుదేలైందని మేము ముందు నుండే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు.
ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండి. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి.