Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: ఆర్బిఐ నివేదికతో తేటతెల్లం

–పదేళ్లలో మేం చేసిన అప్పు రూ.3.22లక్షల కోట్లు మాత్రమే
–రేవంత్‌ మాటల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గాయి
— మాజీమంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: ప్రజా దీవెన, సిద్దిపేట: పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివే దికతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సూచించారు. అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రెస్‌కు ఆ నివేదిక చెంపపెట్టు అని వాఖ్యానించారు. తెలంగాణ దివాళా తీసిన రాష్ట్రం కాదని, దివ్యంగా వెలిగిన రాష్ట్ర మని ఆర్‌బీఐ తేల్చిచెప్పిందన్నా రు. గురువారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. అబద్ధా ల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపు తున్నదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.3 లక్షల 22 వేల 499 కోట్లు మాత్రమే అప్పు చేసిందని పేర్కొ న్నారు. కానీ రూ.7లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.

వీరి ఆరోపణల వల్లనే తెలంగాణకు పెట్టుబడులు తగ్గాయని, అప్పుల రాష్ట్రంగా చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ సంపద పెంచడమేగా కుండా రెట్టింపు చేశారనే విష యాన్ని ఆర్‌బీఐ రిపోర్టులో ఉందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చడంతో పాటు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమం, అభివృద్ధి పేరిట పేదల కు పంచారని హరీశ్‌రావు అన్నా రు. ఇప్పటికైనా విషప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 2014వరకు తెలంగాణ జీఎస్‌డీపీ రూ.4.3 లక్షల కోట్లు ఉంటే 20 23–24వరకు రూ.15.01లక్షల కోట్లకు చేరిందని, 249% వృద్ధిరేటు పెరిగిందని హరీశ్‌రావు వెల్లడించా రు. ప్రజల తలసరి ఆదాయం కూడా రూ.1,03,889 నుంచి రూ.3,56,564కు పెరిగి 243% వృద్ధిరేటు నమోదు చేసుకుందని తెలిపారు.

91లక్షల టన్నులు మాత్ర మే పండిన ధాన్యం ఉత్ప త్తిని పదేళ్లలో 2కోట్ల టన్నులకు చేర్చిన విషయాన్ని ఆర్‌బీఐ పొం దుపర్చడం తమకు గర్వకారణ మని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సృష్టించిన ఆస్తులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెలుగు చూడని వ్వడం లేదని హరీశ్‌రావు ఆరోపిం చారు.సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి పోరాటా నికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుం దని హరీశ్‌ తెలిపారు. తమ ఉద్యో గాలను క్రమబద్ధీకరించి సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేటలో నాలుగు రోజు లుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు దీక్ష కొనసాగిస్తున్నారు. వారి దీక్షకు హరీశ్‌రావు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. అసెంబ్లీ సమావేశా ల్లో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యో గుల కోసం ప్రభుత్వాన్ని నిలదీ స్తామన్నారు.