–సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, అస త్య అంశాలను లేవనెత్తుతున్నారు
–ప్రతి సమవేశంలోనూ ఇదే కొనసాగుతోంది
–సభా నాయకుడు ఆదర్శంగా ఉం డాల్సిందిపొయి గందరగోళం సృష్టిస్తున్నారు
–అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వలోని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినప్పు డల్లా సభను పక్కదోవ పట్టిం చేందుకు పాలకపక్షం విశ్వ ప్రయత్నాలు సాగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, అసత్య అంశాలను సభలో లేవనెత్తుతూ గందరగోళం సృష్టిస్తున్నారని, ప్రతి సమవేశంలో నూ ఇదే కొనసాగుతోందని విమ ర్శించారు. సభా నాయకుడు ఆద ర్శంగా ఉండాల్సిందిపొయి గంద రగోళం సృష్టిస్తున్నారని ధ్వజ మెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
గత సమావేశా ల్లో మేడి గడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజె క్టు (Kaleshwaram Project) సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకో లేదని అబద్ధమాడారని, రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభ ను తప్పు దోవ పట్టించారని ఖండించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీ టర్ల పై కూడా తప్పుడు పత్రం తో సీ ఎం సభను తప్పుదోవపట్టించారని, తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారని దుయ్యబట్టారు. ఈ అంశం పై మే ము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తామ ని చెప్పారు. నేను వ్యవసాయ మో టార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పు కున్నట్టు భ్రమింపజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు పై వై ఎస్ హాయం లో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మా పై ఆరోపణలు చేశారని, పోతిరెడ్డి పాడు పై జీ ఓ రాకముందే మేము వై ఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని, మేము రాజీ నామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణమని గుర్తు చేశారు.పదవుల కోసం పెద వులు మూసుకున్నది రేవంత్ రెడ్డి అని, తానేదో తెలంగాణ ఛాంపియ న్ అయినట్టు రేవంత్ మాట్లా డు తుంటే అందరూ నవ్వుకుంటు న్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీ నామా చేసామని, రేవంత్ రెడ్డి (Revanth Reddy)కనీ సం డూప్లికేట్ రాజీనామా (Duplicate resignation)కూడా చేయలేదని విమర్శించారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలే దనే ఆనాడు బలిదానాలు జరిగా యని ఆరోపించారు.ఆనాటి అమ రుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందని, కేసీఆ ర్ లాగా రాజీనామాలు చేసిన చరి త్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉం దా అని ప్రశ్నించారు.కేసీఆర్ దీక్ష తోనే తెలంగాణ ప్రకటన వచ్చిం దని, 14 యేండ్ల తెలంగాణ ఉద్య మంలో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదని, కేసీఆర్ (kcr)తెలంగా ణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబు తోనే ఉండే వారని, రేవంత్ తెలంగాణ ఉద్యమ కారుల పై దాడికి రైఫిల్ తో బయలు దేరార ని గుర్తు చేశారు.అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని ఎద్దేవా చేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
కేసీఆర్ (kcr) పుణ్యమే ఎల్ ఆర్ ఎస్ గురించి రేవంత్ అపుడు ఏం మాట్లాడారు ఇపుడేం చేస్తున్నారో ఎవరు మర్చిపోలేదని పేర్కొన్నారు. కోమటి రెడ్డి ,భట్టి విక్రమార్క,ఉత్తమ్ ఎల్ ఏర్ ఎస్ ను ఫీజులు (Fees to Komati Reddy, Bhatti Vikramarka, Uttam LRS) లేకుండా చేయాలనీ ఆనాడు డిమాండ్ చేశారని, ఇపు డేం చేస్తున్నారని, మీ వన్నీ ద్వంద్వ ప్రమాణాలేనని, బీఆర్ఎస్ పని అయిపోయిందని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కు గతం లో దేశంలో రాష్ట్రంలో ప్రతి పక్ష హోదా రాలేదు అయినా ఆ పార్టి పని అయిపోయిందా అని వివరించారు. రెండు సార్లూ కాంగ్రెస్ ను మేమే ఓడించాం, కాంగ్రెస్ పని అయిపోయిందా,కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో గతం లో 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని, కాంగ్రెస్ పని అయిపోయిందా,ఇండియా కూట మి 28 పార్టీలతో ఏర్పడ్డదని, కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99 అని ఎద్దేవా చేశారు. జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాది తాను చిన్న తెలంగాణ వాది అని రేవంత్ మాట్లాడుతున్నారని, జైపాల్ రెడ్డి తెలంగాణ కు ఏ పార్టీ నైనా ఒప్పించారా, కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని గుర్తు చేశారు. తెలం గాణ వస్తుంది అనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడారని తెలిపారు. రేవంత్ ఇప్పటికే మూ డు సార్లు అబద్దపు అంశాలతో సభ ను తప్పు దోవ పట్టించారని, మీడి యా కూడా రేవంత్ అబద్దాలను ఎండ గట్టాలని, రుణ మాఫీ పై రేవంత్ ది గోబెల్స్ ప్రచారం చేస్తు న్నారని, 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కి అవుతుందని 25 వేల కోట్లే బడ్జెట్ లో (budget) పెట్టారని చెప్పారు.