Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: నిరుద్యోగులను నిలువునా ముంచారు

–యువత ఉద్యోగాలకై రోడ్డెక్కాల్సి న పరిస్థితిని నెలకొంది
–బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

Harish Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకిచ్చిన హా మీలను వెంటనే నెరవేర్చాలని బీ ఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ (DEMAND) చేశారు. కాంగ్రెస్ ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువతను నిలువునా ముంచి వారిని ఉద్యో గాల కోసం రోడ్డున పడి అలమటిం చాల్సిన పరిస్థితిని తెచ్చారని ఆయ న విమర్శించారు. ఈ మేరకు గ్రూ ప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy)ఆయన బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్నిరుద్యోగులకిచ్చిన హామీ లను వెంటనే నెరవేర్చాలి సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుం దని ఎదురుచూశామని ఆయన పేర్కొన్నారు. కానీ, అందరి ఆశలు అడియాశలు చేసేలా నిరుద్యోగుల (unemployed) కు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2 లక్షల ఉద్యోగాలను గుర్తించి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాం డ్ చేశారు. నిరుద్యోగ భృతిని కూడా వెంటనే చెల్లించాలన్నారు. గ్రూప్- 2కు 2వేల ఉద్యోగాలు, గ్రూప్-3 కి 3వేల ఉద్యోగాలు కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల (EXAMS)మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతు న్నారని, ఒతిడికి గురవుతున్నారని హరీశ్ పేర్కొన్నారు.