Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: దసరా తర్వాత రాహుల్ ఇంటి ముట్టడి

–రేవంత్ రెడ్డి వి అన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు
–హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చితే ఊరుకోం
–తొర్రూరు రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్

Harish Rao: ప్రజా దీవెన, మహబూబాబాద్: వరంగల్ డిక్లరేషన్ (Declaration)అమలు కోసం ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా మని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి మా ట తప్పిన సీఎం రేవంత్ మొన గా డు కాదు, మోసగాడని విమర్శిం చారు. కుంటిసాకు తో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఫైర్అ య్యారు. దసరా లోపు రైతుబంధు (Farmer)పడకపోతే వదిలే ప్రసక్తే లేదని వా ర్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో మూసీకి అనుకొని ఉన్న పేదల ఇండ్లు కూలగొడితే ఊరు కునేది లేదని హెచ్చరించారు.

మహబూ బాబా ద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా లో హరీశ్ రావు (Harish Rao) మాట్లాడు తూ పది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టిం పు లేదు. రెండు లక్షలకు పైన రుణ మాఫీగా క్లారిటీ లేదు. 31 సాకులు పెట్టీ ఎగవెట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీద నమ్మకం లేకుండా పోతుంది. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తం. రుణ మాఫీ అమలు చేయిస్తాం. ప్రజల సమస్యలు పక్కకు పోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడు. రాష్ట్రం లో రౌడీయిజం నడుస్తు న్నది. హైదరాబాబాద్ లో హైడ్రా (hydra)పేరుతో అరాచకం చేస్తున్నారు. ప్రభు త్వం చేసిన మోసాలను ప్రతిపక్షంగా వెంటపడి అడుగు తామని అన్నారు.