–పల్లెల్లో అంటురోగాలు ప్రబలుతు న్నా పట్టించుకునే నాథుడే లేడు
–ఏడు నెలల కాలంలో పంచాయి తీలకు ఒక్క పైసా ఇవ్వలే
–స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వ హించలేని దుస్థితిలో మీ ప్రభుత్వం
–ఎన్డీఏలో చక్రం తిప్పుతున్న చంద్ర బాబుతో చర్చలు జరపండి
–సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హారీష్ రావు అప్పీల్
Harish Rao: ప్రజా దీవెన,హైదరాబాద్: రాష్ట్రం లోని రేవంత్ రెడ్డి (revanth reddy)ప్రభుత్వం ప్రాధా న్యత లేని అంశాలపై దృష్టి సారిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుం దని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మలే రియా, డెంగీ వైరల్ జ్వరాలు ప్రభలి తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఎద్దే వా చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిందని, జిల్లా పరిషత్ కాలం ముగిస్తోందని అయినా ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వ (congress govt) ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్ (demand) చేశారు. నాడు 87 ట్రాక్టర్లు పంచా యతీల్లో ఉంటే నేడు 12,769 ట్రాక్ట ర్లు ఉన్నాయని, దీన్ దయాల్, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.
ఏడు మాసాల్లో ఒక్క పైసా నైనా ఇచ్చారా.. గ్రామాలను తమ ప్రభుత్వ(govt) హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.7 నెలల కాంగ్రెస్ (congress)పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని, దేశానికి ఆద ర్శంగా తెలంగాణ గ్రామాలను కేసీఆ ర్ నిలిపారన్నారు. బీఆర్ఎస్ హ యాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పల్లె, పట్ట ణ ప్రగతి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఎంపీ టీసీలు, జెడ్పీటీసీలకు (For MP TCs and ZPTCs) కూడా జీతం ఖమ్మంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయా రని, వీడియో చూస్తే కన్నీళ్లు వస్తు న్నాయని ఉద్విగ్నానికి లోనయ్యా రు. కాంగ్రెస్ రైతు ఆత్మహత్యకు కారణమని, చనిపోయిన రైతు సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించా రని బాధ్యులపై చర్యలు చేపట్టాల ని డిమాండ్ చేశారు. అదే సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తెలంగాణకు చెందిన 7 మండలా లు, లోయర్ సీలేరు మనకు వచ్చే లా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్ళలో 7 మండలాలు, లోయర్ సీలేరు ఏపీలో కలిపారని గుర్తు చే శారు. కేసీఆర్ నాడు తీవ్రంగా స్పం దించి, నిరసన తెలిపారన్నారు. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు మీ సహచరుడు చంద్రబాబు మీదనే ఎన్డీయే ప్రభు త్వం ఆధారపడిందని, చంద్రబాబు మీద ఒత్తిడి చేసి 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆ తర్వాత విభజన హామీ ల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబానికి పరిహారం ఇవ్వండి.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి రైతు ప్రభాకర్ ఆత్మ హత్య చేసుకుని ఖమ్మంలో చని పోయారన్నారు హరీశ్ రావు. కండ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన రైతు ఆత్మహత్య బాధాకరమని, వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.