Heavy rains: గాలివాన గాండ్రింపు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండలతో మండిపో యిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ పడిన వానలతో చల్లబడింది.
తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం
అన్నదాతలకు ఆనవాయితీగా అకాల వర్షం ఇబ్బందులు
పిడుగు పడి ముగ్గురు, వడదె బ్బతో ఒకరి మృతి
అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
నేడు, రేపు వర్షాలతో ప్రచండ బానుడి ప్రభావం తక్కువే
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం(Heavy rains) సృష్టించింది. పొద్దంతా ఎండలతో మండిపో యిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ పడిన వానలతో చల్లబడింది. ఆదివారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లా ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపో వడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు చాలాచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఆ జిల్లాలోని చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయి కొట్టుకుపో యింది.
వేలాది క్వింటాళ్ల ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, వీర్నపల్లి, ఎల్లారెడ్డి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం, సంగారెడ్డి జిల్లా నారా యణఖేడ్ ప్రాంతంలో కురిసిన వర్షా నికి పలుచోట్ల ధాన్యపు రాశులు తడిసిపోయాయి. హనుమకొండ జిల్లాలోని 9 మండలాలు, వరంగల్ జిల్లాలోని 7 మండలాల్లో కుండపో త వర్షం కురిసింది. చెట్లు విరిగిపడ టంతో 2-3 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్ప డ్డాయి.
వరంగల్ జిల్లా గీసుకొండ, ఖానాపురంలో 6.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.వర్షం పడు తుండటంతో ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పడానికి వెళ్లిన తాత, మనుమడి పై పిడుగు పడ డంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండల పరిధిలోని రామోజీ పల్లికి చెందిన పాల్వంచ శ్రీరాములు (45), శివరాజ్ (13) (శ్రీరాములు అన్న కూతురు కొడుకు) వరుసకు తాత, మనుమడు అవుతారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబోశారు. సాయంత్రం వర్షం రావడంతో ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మా గ్రామానికి చెందిన మామిడిపెల్లి కిరణ్ (38) పిడుగు పాటుతో మృతి చెందగా.. కోల భోజన్న, కూరెల్లి టిల్లు, కొండ రమేశ్, మంగ సంటెన్న తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో పిడుగుపడి ఆవు మరణించింది. ఇటు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో కనుకుట్ల రాధ (40) వడదెబ్బకు అస్వస్థతకు గురై మృతి చెందింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండ్రోజులు ఎండలు తక్కువే ఉంటాయని సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34-40 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. ముఖ్యంగా హైదరా బాద్, మేడ్చల్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34-35 డిగ్రీలు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవు తాయని వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
రాష్ట్రంలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భారీ వర్షా లు, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ఆరా తీశారు. వాతావరణ శాఖ వర్ష సూచనల నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉ న్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబం ధిత శాఖల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాల న్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుం టామని హామీనిచ్చారు. అలాగే జైనథ్ మండలంలో పిడుగుపా టుకు తీవ్రంగా గాయపడిన వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం ఉంచినా రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Heavy rains in Telangana