Hero Chhatrapati Shivaji : ప్రజా దీవెన/ కనగల్: భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ స్త్రీని కన్నతల్లితో సమానంగా గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు గౌరవించి హిందూ ధర్మానికి ఉన్న తెచ్చిన వీరుడు. శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి నేడు భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో చత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది చిన్న తనంలోనే మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడి హిందూ ధర్మ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజ్ శివాజీకే దక్కుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకల జరుపుకుంటాం ముఖ్యంగా మనోహరాస్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు 1974 సంవత్సరంలో రాయఘడ్ కోటలో అధికారికంగా శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది.
నవభూ కి Dhandam పెట్టను shivaaji
తను పనిచేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి 12 సంవత్సరాల శివాజీని కూడా తీసుకొని వెళ్ళాడు తండ్రి సుల్తాన్ కి సలాం చేసిన తండ్రికొడుకుని కూడా సలాం చేయమన్నాడు తండ్రి పరాయి రాజుకు ముందు తల వంఛి సలాం చేయను అన్నాడు శివాజీ ,తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించుకున్నాడు. బాల్యం నుండే అత్తడి దేశభక్తి జాతీయ అభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయనతల్లి జిజియా భాయ్.
మరాఠా వ్యవస్థాపకుడి జననం (బాల్యం) *
శివాజీ క్రీస్తు శకం 1930 ఫిబ్రవరి 19 సంవత్సరంలో వైశాఖ మాసపు. శుక్ల పక్ష తతీయ నాడు పూణే జిల్లాలోని జున్నూరు పట్టణం దగ్గర శివనేరి కోటలో Shaహజీ జిజయ భాయి దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయీ యాదవ క్షత్రియ వంశముకు చెందిన ఆడపడుచు ( దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశం) శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివ పార్వతి పేరు శివాజీకి పెట్టింది శివాజీ తండ్రి అయిన shaహజి. నిజం shaహాల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాలలో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన. షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు shaహజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు. లఘాజీ జాదవ్ రావు అనే. మరాఠ యోధున్ని. నిజాంShaahi ప్రభువు. హత్య చేయించాడు. ఇది నచ్చని shaహజీ. ప్రభువుపైన తిరుగుబాటు బావుట ఎగరవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు..
శివాజీ సామ్రాజ్య అంకురార్పణ
Shaహజీ ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్షాతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిల్సతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. shaహజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు . షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడు అయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీర్ కు వెళ్లాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన ,ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
17 ఏళ్ల వయసులో సుల్తానులతో యుద్ధాలు
17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యాన్నికి చెందిన తోర్నాకోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన్న,రాజుఘడ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్ని అంతా తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆDilsha మోస పూరితంగా శివాజీ తండ్రి అయిన shaహజీని బంధి చేశాడు ఆ తరువాత బెంగుళూరులో ఉన్న శివాజీ అన్నా అయినా శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇద్దరు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరుపొందిన అఫ్జల్ ఖాను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న afjalఖాన్ అతని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ ఘడ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పై దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు శివాజీ తన దగ్గర ఉన్న పిడిపులు గోర్లతో అబ్జల్ ఖాన్ పొట్టను ఉగ్రం లక్ష్మీనరసింహ వలె చీల్చి చెందాడు అఫ్జల్ ఖాన్ తప్పించుకొని బయటికి వెళ్తుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్రమంతా పేరు తెచ్చుకున్నాడు ఈ సంఘటతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి ఎందరో రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు .ఇలా ఎన్నో మొగలాయిలతో యుద్ధాలు చేసి జూన్ 06 1674 సంవత్సరంలో రాయఘడ్ కోటలో వేద పట్టనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికి అధిపతిగా కీర్తిస్తూ చత్రపతి అని బిరుదు ప్రధానం చేశారు.
శివాజీ వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సారధ్యంలో జరిగింది వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, మేధావి అయ్యాడు.
1. జిజియా భాయ్: బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దాయి
2. దాదాజీ కొండా దేవ్: ఇతని దగ్గర రాజకీయము యుద్ధ తంత్రము నేర్చుకున్నాడు.
3. తుకారాం:విరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు.
4. సమర్థ రామదాసు: వీరి దగ్గర ఆధ్యాత్మిక,హైందవ పరిరక్షణనె జీవిత పరమార్ధమని విషయాన్ని నేర్చుకున్నాడు
సుదీర్ఘ యుద్ద కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికిస్త్రీలకు పసివారికి సహాయం చేసేవాడు
ఒకసారి శివాజీ సైనికఅధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడల్ని తీసుకొని శివాజీ ముందు ప్రవేశపెట్టాడు శివాజీ ఆమెతో నా కన్నతల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడ శివాజీ లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు అనేక మసీదులను నిర్మించిన హిందూ పాలకుడు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడము తాను చేస్తున్న పని పట్ల అంకితభావము,మచ్చలేని వ్యక్తిత్వము,ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్టమైనదిగా తీర్చిదిద్దబడింది.
మతసామరస్యం
శివాజీ భవాని దేవి భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు శివాజీ సైన్యంలో మూడంతలు ముస్లింలు ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు హైదరుఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాను నావికాదళానికి,సిద్ధి ఇబ్రహీం మందు గుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు శివాజీకి సర్వసైన్య అధ్యక్షులు దౌవలత్ ఖాన్, సిద్ధికు ఇద్దరు ముస్లింలు ,శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యంగా ఆగ్రా నుంచి శివాజీని తప్పించుకొటానికి సహాయపడిన వ్యక్తి మదని మొహతారు కూడా ముస్లిమే..
పరిపాలన విధానం
యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలన విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగన్యుడు మంత్రిమండలి విదేశాంగ విధానం,పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయకుండా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు..