Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Honor killings : పరువు హత్యల పరంపర, పెద్దపల్లి లో దారుణ ఘటన

Honor killings :  ప్రజా దీవెన, పెద్దపల్లి: ప్రేమలు పె రుగుతూ ఉన్నాయి, అదే సంద ర్భంలో ప్రేమల పేరుతో దారుణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారం కాస్తా దారుణ హ త్యకు కారణమైంది. పెద్దపెల్లి జిల్లా లో పరువు హత్య చోటుచేసుకుం ది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండ లం ముప్పిరితోట గ్రామంలో 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు.

తన కూతురిని ప్రేమిస్తున్నాడని సా యికుమార్ ను యువతి తండ్రి స దయ్య గొడ్డలితో దారుణంగా హత మార్చా డు. ముప్పిరితోటకు చెంది న పూరెల్ల పరశురాములు జ్యో త్స్న దంపతుల కుమారుడు సాయికుమార్ చదువు మానేసి గ్రామంలో ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెం దిన ఓ యువ తీతో ప్రేమలో పడ్డాడు.ఈ విషయం తెలిసిన సదరు యువతీ తండ్రి సా యికుమార్ ను హతమార్చేందుకు పన్నాగం పన్నా రు. ఈ క్రమంలో గురువారం రాత్రి సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ శి వారులో మిత్రులతో కలిసి పుట్టి నరోజు వేడుకలు జరు పుకుంటుం డగా అక్కడికి చేరుకున్న యువతి తండ్రి సదయ్య గొడ్డలితో దారుణం గా దాడి చేశాడు. దీంతో యువకు డు సాయికుమార్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందా డు. సమాచారం అందుకున్న పెద్ద పల్లి ఏసిపి కృష్ణ, సుల్తానాబాద్ సి ఐ సుబ్బారెడ్డి ఆస్ప త్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృ తుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామ ని తెలిపారు. మృ తుడు సాయికు మార్ పుట్టినరోజే హత్యకు గురి కావడం గ్రామంలో కలకలం రేగింది.